Movie News

నాలుగు వేదాలతో సూర్య – చందు సినిమా

ఫాంటసీ, థ్రిల్లర్ సినిమాలను డీల్ చేయడంతో ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న దర్శకుడు చందూ మొండేటి ప్రస్తుతం నాగ చైతన్యతో భారీ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా టీమ్ మొత్తం ఇటీవలే నది తీర ప్రాంతాలకు వెళ్లి జాలర్ల జీవన విధానాన్ని తెలుసుకుని వచ్చారు. తండేల్ టైటిల్ పరిశీలనలో ఉంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమయ్యేది ఇంకో వారంలో తెలిసిపోనుంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుపెడతారు. దీని తర్వాత చందూ మొండేటి సూర్య ప్రాజెక్టుని పట్టేశాడు.

నాలుగు వేదాలు(రిగ్, యజుర్, సామ, అధర్వ) ఆధారంగా చేసుకుని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో కథను సిద్ధం చేశానని సూర్య దాన్ని మెచ్చుకుని క్రమం తప్పకుండ స్క్రిప్ట్ గురించి తెలుసుకుంటూనే ఉన్నారని చందూ చెప్పడం ఆసక్తి రేపుతోంది. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరూ ఖాళీగా లేరు. సూర్య డేట్లు రెండేళ్ల వరకు అందుబాటులో లేవు. కంగువా పూర్తి చేశాక వెట్రిమారన్ వడి వాసల్ తో పాటు మరో రెండు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ఈ లోగా చందూ మొండేటి తండేల్ పూర్తి చేసుకుని కార్తికేయ 3కి సంబంధించిన పనులు మొదలుపెట్టొచ్చు. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

తెలుగు దర్శకులతో చేసేందుకు సూర్య ముందు నుంచి ఉత్సాహం చూపిస్తున్నాడు కానీ సరైన కాంబినేషన్ కుదరలేదు. టాలీవుడ్ లో తనకు ఎంత ఫాలోయింగ్ ఉందో ఇటీవలే సూర్య సన్ అఫ్ కృష్ణన్ కు వచ్చిన స్పందన చూసి అర్థం చేసుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత చందూ మొండేటి ఒక ఫాంటసీ సబ్జెక్టుతో మెప్పించడం విశేషమే. టాప్ లీగ్ లోకి చేరాలని గట్టిగా ప్రయత్నిస్తున్న ఈ విలక్షణ దర్శకులు చైతు, సూర్య సినిమాలు ఆ కార్యాన్ని నెరవేరుస్తామని ఎదురు చూస్తున్నారు. ఒకపక్క చిరు పంచ భూతాలు, ఇంకోవైపు సూర్య నాలుగు వేదాలు మొత్తానికి విభిన్న కథలైతే తెరమీదకొస్తున్నాయి. 

This post was last modified on August 22, 2023 3:13 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

15 mins ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

1 hour ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

3 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

4 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

4 hours ago

తాడిప‌త్రిలో ఉండొద్దు.. జేసీ ఫ్యామిలీని షిఫ్ట్ చేసిన పోలీసులు

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రిలో ఎన్నిక‌ల అనంత‌రం తీవ్ర హింస చెల‌రేగింది. ఇక్క‌డ పోటీలో ఉన్న జేసీ…

10 hours ago