Movie News

పంజా దర్శకుడి కోసం సల్మాన్ గుండు

నిన్న రాత్రి ఒక ఈవెంట్ కు హాజరైన సల్మాన్ ఖాన్ హఠాత్తుగా గుండుతో కనిపించేసరికి విచ్చేసిన అతిథులే కాదు సోషల్ మీడియాలో చూసిన ఫ్యాన్స్ కూడా షాక్ తిన్నారు. ఇటీవలే టైగర్ 3 షూటింగ్ ని పూర్తి చేసిన కండల వీరుడు షారుఖ్ ఖాన్ పఠాన్ లో చేసిన క్యామియో ఏ రేంజ్ లో పేలిందో తెలిసిందే. అయితే ఉన్నట్టుండి జుత్తు మొత్తం ఎందుకు తీయించాడనే సందేహం రావడం సహజం. ఇది కొత్త సినిమా గెటప్ కోసమట.  భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవెల్ లో కరణ్ జోహార్ నిర్మించబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం సల్మాన్ తన అవతారాన్ని పూర్తిగా మార్చుకున్నాడట.

దీనికి దర్శకుడు విష్ణువర్ధన్. ఉత్తినే పేరు చెబితే మన ఆడియన్స్ గుర్తు పట్టరు కానీ పవన్ కళ్యాణ్ కి పంజా లాంటి స్టైలిష్ డిజాస్టర్ ఇచ్చింది ఇతనే. అంతకు ముందు అజిత్ తో తీసిన బిల్లా చాలా పేరు తీసుకొచ్చింది. ఇది చూసే ప్రభాస్ తో మెహర్ రమేష్ బిల్లా రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. అజిత్ ఆరంభం ఓ మోస్తరుగా ఆడినా యట్చన్ అనే తమిళ చిత్రం ఫెయిలయ్యింది. గత ఏడాది సిద్దార్థ్ రాయ్ కపూర్ తో చేసిన షీర్షా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్  స్ట్రీమింగ్ జరుపుకున్నా చాలా ప్రశంసలు తీసుకొచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే డిజిటల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

ఇది చూసే సల్మాన్ ఆఫర్ ఇచ్చాడు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా కరుడుగట్టిన క్యారెక్టర్ లో చాలా రఫ్ గా ఉంటుందట. కరణ్ తో పాటు సాజిద్ నడియాడ్ వాలా ఇందులో నిర్మాణ భాగస్వామిగా ఉండబోతున్నారు. వచ్చే ఏడాది  2024 క్రిస్మస్ విడుదలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బిగ్ బాస్ 14 పూర్తి చేయడం కోసం ఎదురు చూసిన సల్లు భాయ్ అది పూర్తి కాగానే ఇలా క్షవర కళ్యాణం చేయించేసుకున్నాడు. కిసీకా భాయ్ కిసీకా జాన్ దారుణ ఫలితం తర్వాత సోలో హీరోగా సల్మాన్ నుంచి బలమైన హిట్టు కోరుకుంటున్నారు ఫాన్స్. టైగర్ 3 తీర్చేలానే ఉంది. 

This post was last modified on August 22, 2023 12:05 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఒక‌టి జ‌గ‌న్‌కు.. ఒక‌టి ష‌ర్మిల‌కు.. అవినాష్‌కు సున్నా

క‌డ‌ప‌లో అవినాష్ రెడ్డి క‌థ ముగిసిందా? ఎంపీ స్థానాన్ని అత‌ను కోల్పోవాల్సిందేనా? అంటే రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే అంటున్నారు. క‌డ‌ప…

35 mins ago

ఆరంభం టాక్ ఏంటి

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న సినిమా ప్రేక్షకుల అటెన్షన్ దక్కించుకోవడం కష్టం. ట్రైలర్ కట్ తో అది చేసి చూపించిన…

2 hours ago

రూ.10 లక్షలు ఇస్తే ‘నీట్’గా రాసేస్తా !

దేశమంతా ఈ ఆదివారం నీట్ - యూజీ పరీక్షలు జరిగాయి. దేశమంతా 24 లక్షల మంది పరీక్ష రాశారు. గత…

2 hours ago

దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గాలు !

దేశంలో 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న రాజకీయ విశ్లేషకులు, ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదనే ఉంది. ఇందులో…

2 hours ago

కామెడీ హీరో అదృష్టం బాగుంది

ఇమేజ్ ఉన్న మీడియం రేంజ్ స్టార్లకే ఓపెనింగ్స్ వస్తాయా రావా అనే టెన్షన్ ఉన్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. దానికి…

2 hours ago

కాంగ్రెస్‌లో చేరితే వైఎస్ 100 కోట్లు ఇస్తామ‌న్నారు: ఎర్ర‌బెల్లి

మాజీ మంత్రి, తెలంగాణ నాయ‌కుడు, బీఆర్ఎస్ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో తాను…

3 hours ago