తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్.. లోకనాయకుడు కమల్ హాసన్లది తిరుగులేని కాంబినేషన్. తమిళంలో అతి పెద్ద స్టార్లుగా అవతరించి.. ప్రపంచ స్థాయిలో గొప్ప పేరు సంపాదించిన ఈ ఇద్దరూ కెరీర్ ఆరంభంలో కలిసి సినిమాలు చేశారు. వాటితో మంచి గుర్తింపు, విజయాలూ అందుకున్నారు. ఐతే ఇద్దరూ సూపర్ స్టార్లుగా ఎదిగాక మాత్రం కలిసి నటించింది లేదు. ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయారు.
వీళ్లు మళ్లీ కలిసి నటిస్తే చూడాలని కోరుకునేవాళ్లు కోట్లలో ఉన్నారు. వారిలో ఆశలు రేకెత్తిస్తూ.. ఈ మధ్య ఈ కలల కాంబినేషన్లో మల్టీస్టారర్ గురించి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చి వేర్వేరుగా పార్టీలు పెట్టి సినిమాల నుంచి నెమ్మదిగా తప్పుకునే ఆలోచనల్లో ఉన్న ఈ దశలో కలిసి సినిమా ఎక్కడ చేస్తార్లే అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కానీ ఈ ఇద్దరు సూపర్ స్టార్లు నిజంగానే కలిసి నటించబోతున్నారు. వీరి కలయికను మళ్లీ తెరపైకి తేవడానికి యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రయత్నిస్తున్నాడు. అతడి ప్రయత్నం ఫలించినట్లే కనిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లోకేష్ను రజినీ-కమల్ మల్టీస్టారర్ గురించి అడిగితే.. దీని గురించి తానేమీ మాట్లాడనని.. నిర్మాణ సంస్థే వివరాలు వెల్లడిస్తుందని అన్నాడు. కొట్టిపారేయకుండా ఇలా మాట్లాడాడంటే లోకేష్.. రజినీ-కమల్లతో సినిమా చేయబోతున్నాడన్నమాటే.
‘నగరం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లోకేష్.. ఆ తర్వాత ‘ఖైదీ’తో వావ్ అనిపించాడు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. అది విడుదల కాకముందే అతను విజయ్ లాంటి పెద్ద స్టార్తో ‘మాస్టర్’ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. దాని మీదా మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ఏకంగా రజనీ-కమల్ మల్టీస్టారర్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. మరోవైపు ఓ తెలుగు టాప్ స్టార్తో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్లో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి లోకేష్ ఒప్పందం చేసుకున్నాడు.
This post was last modified on August 19, 2020 3:18 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…