బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఈ మధ్య కొంచెం డిమాండ్ తగ్గింది కానీ.. అతడి సినిమాల బడ్జెట్లు, పారితోషకాలు వేరే స్థాయిలోనే ఉంటాయి. క్యామియో రోల్స్ చేసినా సరే.. రోజుకు కోటికి తక్కువ కాకుండా రెమ్యూనరేషన్ పుచ్చుకునే స్థాయి అతడిది. ఈ మధ్య వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొంటున్న అక్షయ్కి ‘ఓఎంజీ-2’ గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఇందులో అక్షయ్ చేసింది అతిథి పాత్రే అయినా కథలో ఆయన పాత్ర కీలకం.
‘గదర్-2’ పోటీని తట్టుకుని ఈ సినిమా దాని స్థాయిలో మంచి వసూళ్లే సాధించింది. వంద కోట్ల క్లబ్బులో కూడా అడుగు పెట్టబోతోంది. ఈ సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా.. అక్షయ్ భారీ పారితోషకం తీసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐతే ఆ ప్రచారాన్ని నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధారె ఖండించాడు. అక్షయ్ అసలు పారితోషకమే తీసుకోకుండా ఈ సినిమాలో ఉచితంగా నటించినట్లు వెల్లడించాడు.
‘‘ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి చూస్తున్నా. అక్షయ్ పారితోషకం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆయన భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు రాసేస్తున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. నిజానికి ‘ఓ మై గాడ్-2’ కోసం అక్షయ్ ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ముందుకు వెళ్లడం కోసం ఆయనే మాకు ఆర్థిక సాయం చేశారు. అనేక అంశాల్లో కీలకమైన సలహాలు ఇచ్చి మాకు తోడుగా నిలిచారు.
‘ఓ మై గాడ్’ రోజుల నుంచి మేం కలిసి సినిమాలు చేస్తున్నాం. మా స్నేహం సుదీర్ఘమైనది. ఇలాంటి విభిన్నమైన సినిమాలకు ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటారు’’ అని అజిత్ తెలిపాడు. ఐతే అక్షయ్ పారితోషకం తీసుకోకపోయినా.. సినిమా విజయవంతం అయింది కాబట్టి లాభాల్లో ఆయనకు వాటా ఉంటుందని అజిత్ చూచాయిగా చెప్పారు. ఈ లెక్కన రెమ్యూనరేషన్గా వచ్చేదానికంటే అక్షయ్ ఎక్కువే అందుకుంటాడన్నమాట.
This post was last modified on August 19, 2023 7:20 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…