బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఈ మధ్య కొంచెం డిమాండ్ తగ్గింది కానీ.. అతడి సినిమాల బడ్జెట్లు, పారితోషకాలు వేరే స్థాయిలోనే ఉంటాయి. క్యామియో రోల్స్ చేసినా సరే.. రోజుకు కోటికి తక్కువ కాకుండా రెమ్యూనరేషన్ పుచ్చుకునే స్థాయి అతడిది. ఈ మధ్య వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొంటున్న అక్షయ్కి ‘ఓఎంజీ-2’ గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఇందులో అక్షయ్ చేసింది అతిథి పాత్రే అయినా కథలో ఆయన పాత్ర కీలకం.
‘గదర్-2’ పోటీని తట్టుకుని ఈ సినిమా దాని స్థాయిలో మంచి వసూళ్లే సాధించింది. వంద కోట్ల క్లబ్బులో కూడా అడుగు పెట్టబోతోంది. ఈ సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా.. అక్షయ్ భారీ పారితోషకం తీసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐతే ఆ ప్రచారాన్ని నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధారె ఖండించాడు. అక్షయ్ అసలు పారితోషకమే తీసుకోకుండా ఈ సినిమాలో ఉచితంగా నటించినట్లు వెల్లడించాడు.
‘‘ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి చూస్తున్నా. అక్షయ్ పారితోషకం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆయన భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు రాసేస్తున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. నిజానికి ‘ఓ మై గాడ్-2’ కోసం అక్షయ్ ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ముందుకు వెళ్లడం కోసం ఆయనే మాకు ఆర్థిక సాయం చేశారు. అనేక అంశాల్లో కీలకమైన సలహాలు ఇచ్చి మాకు తోడుగా నిలిచారు.
‘ఓ మై గాడ్’ రోజుల నుంచి మేం కలిసి సినిమాలు చేస్తున్నాం. మా స్నేహం సుదీర్ఘమైనది. ఇలాంటి విభిన్నమైన సినిమాలకు ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటారు’’ అని అజిత్ తెలిపాడు. ఐతే అక్షయ్ పారితోషకం తీసుకోకపోయినా.. సినిమా విజయవంతం అయింది కాబట్టి లాభాల్లో ఆయనకు వాటా ఉంటుందని అజిత్ చూచాయిగా చెప్పారు. ఈ లెక్కన రెమ్యూనరేషన్గా వచ్చేదానికంటే అక్షయ్ ఎక్కువే అందుకుంటాడన్నమాట.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…