యాంకర్, నటి అనసూయ కన్నీటి పర్యంతం అయ్యింది. సోషల్ మీడియా వేదిక ఇన్స్ టాగ్రామ్ లో ఏడుస్తూ ఉన్న ఒక చిన్న వీడియోతో పాటు సుదీర్ఘమైన మెసేజ్ పెట్టి అభిమానులను షాక్ కి గురి చేసింది. గత కొంత కాలంగా తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఫోటోలు, పోస్టులు విరివిగా షేర్ చేసుకున్న అనసూయకు వాటి వల్ల రకరకాల స్పందనలు ఎదురయ్యాయి. అయినా వాటిని లెక్క చేయలేదు కానీ అప్పుడప్పుడు ధీటుగా బదులివ్వడం చూస్తూనే ఉన్నాం. విజయ్ దేవరకొండ పేరు ముందు ది పెట్టుకున్న విషయంలో రచ్చ చేయడం ఫ్యాన్స్ కి ఇంకా గుర్తుండే ఉంటుంది.
ఇక అనసూయ ఇంగ్లీష్ లో పెట్టిన పోస్టు సారాంశం ఇలా ఉంది. నాకు తెలిసి ప్రాథమికంగా సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ఉద్దేశించినదే సోషల్ మీడియా. ఒకరికొకరు మద్దతుగా నిలవాలనే ఇక్కడకు వస్తాం. సంతోషం, బాధ అన్నీ పంచుకోవడానికి ఉంటాం. నేను షేర్ చేసుకున్న ప్రతి జ్ఞాపకం, డాన్సులు, ఫోజులు, బలమైన కౌంటర్లు, కంబ్యాక్ లు ఇవన్నీ నా లైఫ్ లో భాగమే. బలంగా లేని రోజుల్లో నాకూ ఎదురుదెబ్బలు, ఎత్తుపల్లాలు వచ్చాయి. ఒక పబ్లిక్ ఫిగర్ గా వీటిని నేను తప్పించుకోలేను. అలా అని తలొగ్గను. అందరికీ చెడ్డ రోజులు వస్తాయి. అయిదు రోజులు క్రితం జరిగిన ఒక సంఘటనకు స్పందనే ఇది.
చెప్పీ చెప్పనట్టు అనసూయ పెట్టిన ఇన్స్ టా పోస్టులో పూర్తి వివరాలు లేవు. అంతగా బాధించిన వ్యక్తి లేదా ఘటన ఏదైనా దానికి సంబంధించిన వివరణ కొంతైనా ఇచ్చి ఉంటే బాగుండేది. అంత పొడవైన సందేశంలో క్లారిటీ మిస్ అయ్యింది. అయినా సెలబ్రిటీలు అన్నాక నెటిజెన్లు ఏదో కారణంతో లక్ష్యంగా చేసుకోవడం సహజం. దానికి ఎవరూ మినహాయింపు కాదు. కేవలం ఒకరో ఇద్దరో బలవ్వడం ఉండదు. సంపూర్ణేష్ నుంచి మెగాస్టార్ దాకా అందరూ వీటి బారిన పడ్డవాళ్లే. కాకపోతే లైట్ తీసుకుని ముందెళ్లడం తప్ప ఎవరైనా ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదు.
This post was last modified on August 19, 2023 4:39 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…