బిగ్ బాస్ షో ద్వారా పాపులరైన సోహెల్ ఆడపాదడపా సినిమాలు చేస్తున్నా అవి ప్రేక్షకులకు రిజిస్టర్ కాక ముందే థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయి. మిస్టర్ ప్రెగ్నెంట్ విషయంలో టీమ్ చేసిన ప్రమోషన్ల వల్ల కొత్త రిలీజుల్లో ఇదొకటి ఉందన్న సంగతి జనాలకు తెలిసింది. ఇప్పటిదాకా రాని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాకు శ్రీనివాస్ వింజనం దర్శకత్వం వహించగా అప్పిరెడ్డి నిర్మించారు. మొన్న సాయంత్రం కూకట్పల్లిలో గర్భిణులకు ప్రత్యేక షో వేసి మరీ పబ్లిసిటీ చేసుకున్నారు. మరి నిజంగా మిస్టర్ ప్రెగ్నెంట్ డెలివరీ విజయవంతంగా జరిగిందా
టాటూలు వేస్తూ జీవనోపాధి సంపాదించుకున్న గౌతమ్(సోహైల్)ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటుంది మహి(రూప). అయితే అమ్మాయిలు ప్రెగ్నెన్సీకి లోనవ్వడం మీద విపరీత భయాలున్న గౌతమ్ అది జరగకూడదని ముందే మహికి కండీషన్ పెడతాడు. అయితే అనుకోకుండా ఆమె గర్భం దాలుస్తుంది. ఒక లేడీ డాక్టర్(సుహాసిని) సహాయంతో భార్యకు బదులుగా తాను ఆ పిండం మోసే బాధ్యతను తీసుకుంటాడు. దీంతో ఈ జంట జీవితం ఊహించని పెను మార్పులు, సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిని దాటుకుని గౌతమ్ చివరికి ఏం చేశాడనేదే కథ
పాయింట్ చాలా విభిన్నంగా అనిపించినా ప్రాక్టికల్ గా ఎంత మాత్రం సాధ్యమయ్యే అవకాశం లేని సబ్జెక్టు తీసుకున్న దర్శకుడు శ్రీనివాస్ దాన్ని ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయాలు, ప్రేమకథతో చాలా టైం వేస్ట్ చేసి అసలు ట్విస్టుని ఇంటర్వెల్ నుంచి మొదలుపెట్టాడు. రెండో సగం భావోద్వేగాలు, బ్రహ్మాజీ-సుహాసిని లాంటి సీనియర్ల వల్ల కొంత సేవ్ అయ్యింది కానీ అవసరం లేని విలన్ ఎపిసోడ్ అడ్డంకిగా మారింది. ఆర్టిస్టుల వరకు అందరూ బాగానే చేశారు.. ప్రీ క్లైమాక్స్ లో ఇచ్సిన సందేశం బాగున్నప్పటికీ కంటెంట్ బ్యాలన్స్ గా చెప్పడంలో తడబడటంతో ఒక మంచి అవకాశం వృథా చేసినట్టు అయ్యింది.
This post was last modified on August 19, 2023 11:18 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…