తెలుగు సినిమాల్లో భక్త కన్నప్పకు ప్రత్యేక స్థానం ఉంది. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి లాంటి ఎందరో దేవుళ్ళ మీద లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి కానీ కృష్ణంరాజు పోషించిన కన్నప్పను మాత్రం ఎవరూ టచ్ చేయలేకపోయారు. పరమ శివ భక్తుడైన ఆ దైవాంశసంభూతుడి కథను దర్శకులు బాపు కంటే గొప్పగా చెప్పలేమేమోనని ముందుకు రాలేదు. కానీ మంచు ఫ్యామిలీ ఆ సవాల్ ని స్వీకరించింది. కన్నప్పను ప్యాన్ ఇండియా రేంజ్ లో ఇప్పటి తరానికి విజువల్ ట్రీట్ రూపంలో అందివ్వాలని నిర్ణయించుకుని ఇవాళ పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసింది.
నిజానికీ ప్రాజెక్టు గురించి గతంలో మోహన్ బాబు, విష్ణు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు కానీ ఎంతమేరకు కార్యరూపం దాలుస్తుందనే దాని మీద సందేహాలు వ్యక్తమయ్యాయి. ఫైనల్ గా వాటికి చెక్ పెట్టేశారు. కన్నప్పకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయనకు టీవీ సీరియల్స్ లో చాలా అనుభవముంది. చంద్రకాంత, రజియా సుల్తానా, తెనాలి రామ, చంద్ర నందిని లాంటి ఎన్నో సూపర్ హిట్ సిరీస్ లను అందించారు. అన్నీ ఘన విజయం సాధించినవే. ఇందులో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించనుంది, బడ్జెట్ వంద కోట్లపైనే ఉంటుందని ఇంతకు ముందే చెప్పారు.
ఇది విష్ణు డ్రీం ప్రాజెక్టు. కృష్ణంరాజుగారు ప్రభాస్ తో చేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. తనికెళ్ళ భరణి ఒక వెర్షన్ రాశారని విష్ణు చెప్పాడు కానీ ఇది అదేనా లేక మరొకటి రాసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న విష్ణుకి జిన్నా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అందుకే వేరే కమిట్ మెంట్స్ ఇవ్వకుండా పూర్తిగా కన్నప్ప కోసమే సిద్ధమయ్యాడు. గ్రాఫిక్స్ కోసం విదేశీ నిపుణుల టీమ్ పని చేయనుందని సమాచారం. కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో కన్నప్పగా వస్తున్న విష్ణు వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…