తెలుగు సినిమాల్లోకి పర భాషల నుంచి చాలామంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ అందులో జాక్పాట్ కొందరికే దక్కుతుంది. ఆ కొంతమంది మాత్రమే హీరోయిన్లుగా ఒక స్థాయి అందుకుంటారు. కొంతమందికి అందంతో పాటు అన్నీ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాదు. కొన్ని సినిమాలు చేసి కనుమరుగైపోతుంటారు. కన్నడ భామ నేహా శెట్టి కూడా ఈ కోవలోకి చేరే అమ్మాయిలాగే కనిపించింది.
స్టార్ హీరోయిన్ కాగల ఫీచర్స్ అన్నీ ఉన్న నేహా.. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్సు చేసి మరీ సినిమాల్లోకి రావడం విశేషం. ఐతే తెలుగులో ఆమె నటించిన తొలి రెండు చిత్రాలు మెహబూబా, గల్లీ రౌడీ డిజాస్టర్లయ్యాయి. దీంతో ఆమె మీద ప్రేక్షకుల దృష్టి పెద్దగా పడలేదు. ఇంకో ఫెయిల్యూర్ వస్తే కనుమరుగైపోయేదేమో. కానీ ‘డీజే టిల్లు’ ఆమె జాతకాన్ని మార్చేసింది. ఈ సినిమాతో నేహా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. వెంటనే అవకాశాలు వరుస కట్టాయి.
ఐతే నేహాకు వచ్చినవి మరీ పెద్ద ఛాన్సులైతే కాదు. కార్తికేయతో ‘బెదురులంక 2012’.. కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’.. విశ్వక్సేన్తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ లాంటి చిన్న-మీడియం రేంజ్ సినిమాల్లోనే నేహాకు కథానాయికగా అవకాశాలు వచ్చాయి. అలా అని నేహా ఏమీ నిరాశ చెందలేదు. ఉన్న అవకాశాలనే పూర్తిగా వాడుకోవడానికి ఫిక్సయింది. ‘డీజే టిల్లు’తో తనకు గ్లామర్ ఇమేజ్ రావడంతో.. కథానాయికగా నెక్స్స్ లెవెల్కు వెళ్లడానికి ఆ ఇమేజ్నే ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే ‘రూల్స్ రంజన్’లో సమ్మోహనుడా పాటలో సూపర్ సెక్సీగా కనిపించి కుర్రాళ్ల గుండెలకు గాయం చేసింది నేహా.
‘బెదురులంక’లో సైతం ఆమె చేసింది గ్లామర్ రోలే. ఈ సినిమా ట్రైలర్లోనూ నేహా బాగా హైలైట్ అయింది. తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి ఓ పాట లాంచ్ కాగా అందులో తడి అందాలతో నేహా మత్తెక్కించేసింది. ఈ పాట లాంచ్ సందర్భంగా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో విశ్వక్సేన్తో కలిసి చేసిన ఆన్ స్టేజ్ రొమాన్స్ కూడా హాట్ టాపిక్ అయింది. చూస్తుంటే నేహాది ఆలౌట్ గ్లామర్ ఎటాక్ లాగే కనిపిస్తోంది. మొత్తానికి చిన్న సినిమాలతోనే నేహా ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. ఈ సినిమాలు క్లిక్ అయ్యాయంటే నేహా కెరీర్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం.
This post was last modified on August 18, 2023 1:05 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…