అడివి శేష్తో ‘మేజర్’ చిత్రాన్ని మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్పై సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంలో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ నాటికి విడుదల చేయాలని మేజర్ టీమ్ ప్లాన్ చేసుకుంటే కరోనా వచ్చి వారి ప్లాన్స్ అన్నీ డిస్టర్బ్ చేసేసింది. అయితే సినిమా షూటింగ్స్పై ఆంక్షలను ప్రభుత్వం ఎత్తి వేయడంతో మేజర్ షూటింగ్ తక్కువ మంది బృందంతో చేయడానికి సర్వ సన్నద్ధమయి కొన్ని రోజుల షూటింగ్ కూడా చేసారు. కొద్ది రోజుల షూటింగ్ తర్వాత ముందు జాగ్రత్త కోసమని కరోనా టెస్ట్ యూనిట్ అంతా చేయించుకోగా వారిలో సగం మందికి పాజిటివ్ వచ్చిందట.
ఈ విషయం తెలిసి నమ్రత, మహేష్ షూటింగ్ ఉన్నపళంగా ఆపేసి క్వారంటైన్కు వెళ్లమన్నారట. రేపో మాపో తాను కూడా షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటోన్న మహేష్కి బయట పరిస్థితులు ఎలా వున్నాయనేది అర్థమయింది. కరోనా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే వరకు షూటింగ్స్కి వెళ్లకూడదని ఈ సంఘటన తర్వాత మన తెలుగు హీరోలు మరింతగా ఫిక్స్ అయిపోయారట. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నా కానీ కరోనా ఏదో ఒక రకంగా కమ్ముకొచ్చేస్తూ వుండడంతో అసలు ఇక షూటింగ్స్ ప్రశాంతంగా ఎప్పటికి చేసుకోవచ్చుననేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నిర్మాతలు.
This post was last modified on August 20, 2020 3:18 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…