అడివి శేష్తో ‘మేజర్’ చిత్రాన్ని మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్పై సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంలో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ నాటికి విడుదల చేయాలని మేజర్ టీమ్ ప్లాన్ చేసుకుంటే కరోనా వచ్చి వారి ప్లాన్స్ అన్నీ డిస్టర్బ్ చేసేసింది. అయితే సినిమా షూటింగ్స్పై ఆంక్షలను ప్రభుత్వం ఎత్తి వేయడంతో మేజర్ షూటింగ్ తక్కువ మంది బృందంతో చేయడానికి సర్వ సన్నద్ధమయి కొన్ని రోజుల షూటింగ్ కూడా చేసారు. కొద్ది రోజుల షూటింగ్ తర్వాత ముందు జాగ్రత్త కోసమని కరోనా టెస్ట్ యూనిట్ అంతా చేయించుకోగా వారిలో సగం మందికి పాజిటివ్ వచ్చిందట.
ఈ విషయం తెలిసి నమ్రత, మహేష్ షూటింగ్ ఉన్నపళంగా ఆపేసి క్వారంటైన్కు వెళ్లమన్నారట. రేపో మాపో తాను కూడా షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటోన్న మహేష్కి బయట పరిస్థితులు ఎలా వున్నాయనేది అర్థమయింది. కరోనా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే వరకు షూటింగ్స్కి వెళ్లకూడదని ఈ సంఘటన తర్వాత మన తెలుగు హీరోలు మరింతగా ఫిక్స్ అయిపోయారట. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నా కానీ కరోనా ఏదో ఒక రకంగా కమ్ముకొచ్చేస్తూ వుండడంతో అసలు ఇక షూటింగ్స్ ప్రశాంతంగా ఎప్పటికి చేసుకోవచ్చుననేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నిర్మాతలు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…