అడివి శేష్తో ‘మేజర్’ చిత్రాన్ని మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్పై సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంలో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ నాటికి విడుదల చేయాలని మేజర్ టీమ్ ప్లాన్ చేసుకుంటే కరోనా వచ్చి వారి ప్లాన్స్ అన్నీ డిస్టర్బ్ చేసేసింది. అయితే సినిమా షూటింగ్స్పై ఆంక్షలను ప్రభుత్వం ఎత్తి వేయడంతో మేజర్ షూటింగ్ తక్కువ మంది బృందంతో చేయడానికి సర్వ సన్నద్ధమయి కొన్ని రోజుల షూటింగ్ కూడా చేసారు. కొద్ది రోజుల షూటింగ్ తర్వాత ముందు జాగ్రత్త కోసమని కరోనా టెస్ట్ యూనిట్ అంతా చేయించుకోగా వారిలో సగం మందికి పాజిటివ్ వచ్చిందట.
ఈ విషయం తెలిసి నమ్రత, మహేష్ షూటింగ్ ఉన్నపళంగా ఆపేసి క్వారంటైన్కు వెళ్లమన్నారట. రేపో మాపో తాను కూడా షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటోన్న మహేష్కి బయట పరిస్థితులు ఎలా వున్నాయనేది అర్థమయింది. కరోనా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే వరకు షూటింగ్స్కి వెళ్లకూడదని ఈ సంఘటన తర్వాత మన తెలుగు హీరోలు మరింతగా ఫిక్స్ అయిపోయారట. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నా కానీ కరోనా ఏదో ఒక రకంగా కమ్ముకొచ్చేస్తూ వుండడంతో అసలు ఇక షూటింగ్స్ ప్రశాంతంగా ఎప్పటికి చేసుకోవచ్చుననేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నిర్మాతలు.
This post was last modified on August 20, 2020 3:18 pm
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…
అదేంటో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ పదే పదే నోరు జారే తప్పులు చేస్తూనే ఉన్నారు. రాబిన్ హుడ్ టైంలో ఆస్ట్రేలియా…