కేవలం ఎన్నికలను ప్రభావితం చేయడానికే వ్యూహం సినిమా తీస్తున్నానని చెప్పిన రామ్ గోపాల్ వర్మ దానికి అంత సీన్ ఉందో లేదో తెలియదు కానీ టీజర్ల రూపంలో కంటెంట్ మొత్తం ఓపెన్ చేస్తున్నారు. ఇవాళ కొత్తగా వదిలిన వీడియోలో ఏ అంశాలను ఏ కోణంలో చూపించారో వివరించే ప్రయత్నం చేశారు. పావురాల గుట్టలో వైఎస్ఆర్ హఠాన్మరణం తర్వాత జగన్ చుట్టూ జరిగిన పరిణామాలను సబ్జెక్టుగా తీసుకున్న వర్మ ఊహించినట్టే చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ తదితరులు ఏదో పెద్ద కుట్రలో భాగమైనట్టుగా సన్నివేశాలు పొందుపరిచిన తీరు కనిపిస్తోంది.
సానుభూతి జగన్ వైపు వచ్చేలా చేసెందుకు సోనియా గాంధీ, మన్ మోహన్ సింగ్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి తదితరులను పోలిన పాత్రలను పెట్టేందుకు వర్మ వెనుకాడలేదు. జగన్ క్యారెక్టర్ చేసిన అజ్మల్ కి మిమిక్రి ద్వారా అచ్చం ఇప్పటి ఏపీ ముఖ్యమంత్రి గొంతులాగే అనిపించేలా డబ్బింగ్ చెప్పించడం సహజత్వం కోసం తాపత్రయపడిన కృత్రిమ ప్రయత్నం. విజువల్స్ అన్నీ ఎప్పటిలాగే వర్మ స్టాండర్డ్ కు తగ్గట్టే తక్కువగా ఉన్నాయి. చిరంజీవిని పోలిన ఆర్టిస్టుతో సహా అందరూ మరీ కృతకంగా ఉన్నారు. ప్రొడక్షన్ వేల్యూస్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది గ్రాండ్ నెస్ కి స్కోప్ లేనప్పుడు.
వ్యూహం వల్ల జగన్ మోహన్ రెడ్డికి జరగబోయే మేలెంతో తెలియదు కానీ ఆయన బ్రాండ్ ని వాడి వర్మ బిజినెస్ చేయబోతున్నాడు. వైఎస్ఆర్ సీపీ సానుభూతిపరులు, మద్దతుదారులు ఎలాగూ చూస్తారు. ఆవసరమైతే అధిక పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రమోషన్ లో భాగం కావొచ్చు. ఏకంగా జగన్ నే పర్సనల్ గా కలిసి వచ్చి తన ఉద్దేశాలు వివరించిన వర్మ ఇప్పుడీ వ్యూహం ద్వారా తన భక్తిని నిరూపించుకోబోతున్న వైనం స్పష్టం. మానస రాధాకృష్ణన్, ధనుంజయ్, సురభి తదితరులు ఇతర తారాగణం చాలానే ఉంది కానీ ఎవరూ కనీసం గుర్తుపట్టే ఆర్టిస్టులు లేకపోవడం ఫైనల్ ట్విస్టు
This post was last modified on August 15, 2023 1:21 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…