ఈ ఏడాదే ‘సార్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టాడు ధనుష్. అతడికి చాలా ఏళ్ల నుంచి తెలుగులో మంచి ఫాలోయింగే ఉన్నప్పటికీ.. స్ట్రెయిట్ మూవీ చేయడంతో మరింతగా మన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ధనుష్ తర్వాతి చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ మీద తెలుగులో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీని తర్వాత ఈ తమిళ స్టార్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా అనౌన్స్ అయి రెండేళ్లు అవుతోంది కానీ.. ఇంకా సెట్స్ మీదికి వెళ్లలేదు. స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ విషయంలో కమ్ముల చాలా టైం తీసుకుంటాడన్న సంగతి తెలిసిందే. అందులోనూ ధనుష్తో చేయబోయేది పాన్ ఇండియా మూవీ కావడంతో మరింత సమయం పడుతోంది. చాన్నాళ్లుగా వార్తల్లో లేని ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
ధనుష్-శేఖర్ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా ఎంపికైంది. ఈ కన్నడ అమ్మాయికి తెలుగులోనే కాక కన్నడ, తమిళం, హిందీ.. ఇలా పలు భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి క్రేజీ హీరోయిన్ ధనుష్ సినిమాలోకి వచ్చిందంటే హైప్ మరింత పెరగడం ఖాయం. ధనుష్కు ఆమె సరైన జోడీ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కమ్ములతో ‘లవ్ స్టోరీ’ తీసిన ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు.
ఇదొక గ్యాంగ్స్టర్ డ్రామా అని.. కమ్ముల ఇప్పటిదాకా తీసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. తొలిసారి యాక్షన్ టచ్ ఉన్న సినిమా తీస్తుండటంతో దీన్ని కమ్ముల ఎలా డీల్ చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ధనుష్ ఓకే చేశాడు అంటే ఈ కథ ప్రత్యేకంగా ఉంటుందనే భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదికి వెళ్లే అవకాశమున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కావచ్చు.
This post was last modified on August 14, 2023 3:30 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…