ఎప్పుడో స్టార్ డం తగ్గిపోయి రిటైర్ మెంట్ కు దగ్గరలో ఉన్న సన్నీ డియోల్ కు గదర్ 2 రూపంలో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దక్కింది. ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన ఆల్ టైం క్లాసిక్ కి కొనసాగింపుగా వచ్చిన ఈ పీరియాడిక్ డ్రామాకు మాస్ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం మూడు రోజులకు 134 కోట్లు వసూలు చేసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ముఖ్యంగా పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాల్లో జనాలు ట్రాక్టర్లు కట్టుకుని మరీ మల్టీప్లెక్సులకు వస్తున్న వీడియోలు ట్విట్టర్ లో వైరల్ గా మారాయి. రేపు ఇండిపెండెన్స్ డేకి ఇంకా అరాచకం ఉంటుందని అంచనా.
దర్శకుడు అనిల్ శర్మ టేకింగ్ పరంగా పాత పద్ధతినే ఫాలో అవుతూ, సుదీర్ఘమైన నిడివితో తండ్రి కొడుకుల ఎమోషన్ మీద కథను నడిపినప్పటికీ సగటు ప్రేక్షకులకు ఆ భావోద్వేగాలు బాగా కనెక్ట్ అయ్యాయి. అమీషా పటేల్ నే హీరోయిన్ గా తీసుకోవడం, అప్పటి ఆల్బమ్ లో రెండు ఛార్ట్ బస్టర్స్ ని తిరిగి వాడుకోవడం హైప్ ని పెంచాయి. పోటీకి అక్షయ్ కుమార్ ఉన్నప్పటికీ సన్నీ ఈ రేంజ్ లో బాక్సాఫీస్ ని షేక్ చేయడం చిన్న విషయం కాదు . నిన్న ఆదివారం చాలా చోట్ల షారుఖ్ ఖాన్ పఠాన్ కంటే ఎక్కువ థర్డ్ డే నెంబర్లు వచ్చినట్టు ముంబై టాక్. ఈ ట్రెండ్ ఇంకా కొనసాగనుంది.
ఒకవేళ ఓ మై గాడ్ 2 లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఆల్ టైం రికార్డులు నమోదయ్యేవన్న కామెంట్ లో నిజం లేకపోలేదు. సోలో హీరోగా సన్నీ డియోల్ సక్సెస్ చూసి ఎంత కాలమయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం. స్టార్ హీరోలు ఎంత గ్యాప్ వచ్చినా, ఎంత విరామం తీసుకున్నా సరైన కాంబినేషన్ దొరకాలే కానీ ఏ స్థాయిలో కం బ్యాక్ చేయగలరో గదర్ 2 మరోసారి నిరూపించింది. గత మూడు నాలుగు నెలలుగా రామ్ కామ్ ఎంటర్ టైనర్లతో బోర్ కొట్టేసిన ఉత్తరాది మాస్ కి గదర్ 2 ఎడారిలో పెప్సీ కోలాలా కనిపించింది. ఇంకేముంది పొలోమని అర్ధరాత్రి షోలను కూడా హౌస్ ఫుల్ చేసి పడేస్తున్నారు.
This post was last modified on August 14, 2023 12:56 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…