ఒకప్పుడు కల్ట్ క్లాసిక్ ఫిలిం మేకర్ గా గొప్ప పేరు తెచ్చుకుని ఎందరో గర్వపడే శిష్యులను సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ ఆ వైభవాన్ని పోగొట్టుకుని ఏళ్ళు గడిచిపోయాయి. సి గ్రేడ్ కంటెంట్ తో తన స్థాయికి తగని సినిమాలు తీస్తూ ఇప్పుడు ఏకంగా ఏపీ అధికార పార్టీకి సోషల్ మీడియా క్యాంపైనర్ గా మారిపోయిన వైనం ఆయన్ని విపరీతంగా ఇష్టపడిన వాళ్ళను బాధ పెడుతోంది. సరే ఎవరేం అనుకున్నా నా ధోరణి నాదే నా లోకం నాదేననే వర్మ తాజాగా వ్యూహం తీస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ చనిపోయాక జరిగిన పరిణామాలు ఆధారంగా కథను రాసుకున్నారు.
త్వరలోనే విడుదల కాబోతున్న ఈ వ్యూహం వచ్చే ఏడాది ఎన్నికలను ప్రభావితం చేస్తుందని వర్మ చెప్పడం కంటే పెద్ద జోక్ మరొకటి ఉండదు. వన్ సైడ్ పొలిటికల్ అజెండాతో సినిమా తీసినప్పుడు దాన్ని గుడ్డిగా నమ్మేసేంత అమాయకత్వంలో ఓటర్లు లేరు. ఇంతకు ముందు దురుద్దేశాలతో తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్, కడప రాజ్యంలో అమ్మ బిడ్డలు, పవర్ స్టార్ లను ఎవరూ పట్టించుకోలేదు. నాసిరకం కంటెంట్ కి ఫ్యాన్సే దండం పెట్టారు. అలాంటిది ఇప్పుడేదో వ్యూహంతో అద్భుతాలు జరిగిపోతాయనే రేంజ్ లో బిల్డప్ ఇవ్వడం చూస్తే ఇంతకన్నా నవ్వొచ్చే అంశం మరొకటి ఉండదు.
రంగం విలన్ అజ్మల్ ఈ వ్యూహంలో జగన్ మోహన్ రెడ్డిగా నటిస్తున్నాడు. ఇందులోనూ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ జగన్ చాలా మంచివాడనే చెప్పే తాపత్రయమే వర్మది. మహి వి రాఘవ యాత్ర 2 కూడా ఇదే బాపతు అయినప్పటికీ కనీసం అందులో మేకింగ్ ఒక స్టాండర్డ్ లో ఉంటుంది. కానీ వర్మ ఏకంగా ఎలక్షన్ల మీద ఎఫెక్ట్ చూపించే రేంజ్ లో సినిమా తీస్తానని చెప్పడం పట్ల నెటిజెన్లు మంచి జోకులు వేసుకుంటున్నారు. అయినా ఎవరి ఉద్దేశాలేంటో స్పష్టంగా అర్థమవుతున్నప్పడు ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వడం ద్వారా ఏదో జరుగుతుందనుకోవడం అమాయకత్వమే.
This post was last modified on August 14, 2023 12:19 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…