మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై ముందు నుంచి అంచనాలు అంతంతమాత్రమే. టీజర్.. ట్రైలర్.. పాటలు ఏవీ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేకపోయాయి. విడుదల ముంగిట కూడా హైప్ రాలేదు. ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ మీద గట్టిగానే పడింది. మెగాస్టార్ సినిమాకు మంచి మంచి స్క్రీన్లలో కూడా తొలి రోజు మార్నింగ్ షోలు ఫుల్ కాకపోవడం ‘భోళా శంకర్’కే జరిగింది.
ఇక అతి తక్కువ అంచనాలతో థియేటర్లలో అడుగు పెట్టినా సరే తీవ్ర నిరాశ తప్పని స్థాయిలో సినిమా సాగడంతో మెగా అభిమానులే తట్టుకోలేక నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. సినిమాలో ‘క్రింజ్’ అనిపించే సీన్లకు.. డైలాగులకు లోటే లేదు. చిరంజీవి పెర్ఫామెన్స్.. ఆయన డ్యాన్సులు.. ఫైట్లు కూడా సినిమాను కాపాడే పరిస్థితి లేదని థియేటర్ల నుంచి బయటికి వస్తున్న ప్రేక్షకుల స్పందనను బట్టి అర్థమవుతోంది.
‘భోళా శంకర్’లో అత్యంత ఇబ్బంది పెట్టిన సన్నివేశం అంటే.. ‘ఖుషి’ నడుము సీన్ను రీక్రియేట్ చేసిన ఎపిసోడే. ఇప్పటికే ఆ సన్నివేశాన్ని చాలా చిత్రాల్లో పేరడీ చేయడం చూశాం. అవన్నీ చాలా వరకు కమెడియన్లు చేసినవే. కానీ చిరంజీవి స్థాయికి ఏం అవసరం వచ్చిందని ఈ సీన్కు పేరడీ చేయాలనుకున్నారో తెలియదు. పవన్ మెడ రుద్దుకుంటూ హ హ అనే మేనరిజంను అనుకరిస్తూ ఇంతకుముందు ఒక బిట్ వదిలినపుడే నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది.
చిరు స్థాయికి ఇలాంటివి అవసరమా అని మెగా అభిమానుల నుంచే ప్రశ్నలు తలెత్తాయి. ఇక సినిమాలో అయితే.. ‘ఖుషి’ నడుము సీన్నే రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఐతే చాలా ఎబ్బెట్టుగా అనిపించేలా ఆ సీన్ తీయడంతో అదెప్పుడు ముగిసిపోతుందా అన్న ఫీలింగ్ కలిగింది. చిరు ఈ వయసులో ఇలాంటి సీన్ చేయడం.. అందులో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఆయన్ని ఎంతగానో అభిమానించే కుటుంబ ప్రేక్షకులకు ఏమాత్రం రుచించే అవకాశం లేదు. కనీసం ఫైనల్గా సినిమా చూసుకున్న టైంలో అయినా చిరు దీన్ని కట్ చేయించి ఉండాల్సిందేమో.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…