Movie News

‘ఆచార్య’ అప్‌డేట్‌పై దోబూచులాట

మెగాస్టార్ చిరంజీవి అభిమానులిప్పుడు ఉత్కంఠతో ఊగిపోతున్నారు. చిరు పుట్టిన రోజుకు ఇంకో నాలుగు రోజులే సమయం ఉంది. ఈసారి ఆయన పుట్టిన రోజుకు హంగామా మామూలుగా ఉండదని సంకేతాలందుతున్నాయి.

వివిధ సినీ పరిశ్రమల నుంచి 65 మంది ఫిలిం సెలబ్రెటీలతో చిరు పుట్టిన రోజు కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తునే వేడుకలు చేయడానికి అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఆగస్టు 22న చిరు కొత్త సినిమాల ముచ్చట్లు సందడి చేయబోతున్నాయని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చిరు నటిస్తున్న ‘ఆచార్య’ నుంచి అభిమానుల్ని అలరించే అప్ డేట్ వస్తుందంటున్నారు. అలాగే చిరు చేయబోయే భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కూడా అధికారికంగా వెల్లడిస్తారట.

‘ఆచార్య’ విషయంలో అప్ డేట్ ఏంటన్నదే అందరిలోనూ ఆసక్తి రేపుతున్న విషయం. టైటిల్ అధికారికంగా ప్రకటించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా లేదా టీజర్ లాంటిదేమైనా ప్లాన్ చేశారా అన్నది తెలియదు. కానీ అప్ డేట్ మాత్రం కచ్చితంగా ఉంటుంది.

ఈ సినిమా పట్టాలెక్కి పది నెలలు దాటిన నేపథ్యంలో కచ్చితంగా అప్ డేట్ ఇవ్వాల్సిందే. దీని గురించి ‘ఆచార్య’ నిర్మాణ భాగస్వామి అయిన ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ కూడా ట్విట్టర్లో అభిమానులతో దోబూచులాట ఆడుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాలకు ఆ సంస్థ ఒక ట్వీట్ వేసింది.

‘మాకు ఈ నంబర్ అంటే ఎంతో ఇష్టం’ అని కిందికి చూపిస్తున్న సింబల్ ఉంది ఆ ట్వీట్లో. కింద టైమ్ 1.52 చూపిస్తోంది. ‘ఆచార్య’ చిరు 152వ సినిమా అన్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చిరు పుట్టిన రోజున ‘ఆచార్య’ అప్ డేట్ కచ్చితంగా ఉంటుందన్న సంకేతాలు అందుతున్నాయి.

Satya

Recent Posts

శ్రీలీలని టార్గెట్ చేయడం సబబేనా

లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్…

2 hours ago

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

3 hours ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

3 hours ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

4 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

4 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

4 hours ago