‘అజ్ఞాతవాసి’ తర్వాత రెండేళ్ల పాటు రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక దశలో పవన్ తీరు చూస్తే మళ్లీ సినిమాలు చేసే ఉద్దేశమే లేదన్నట్లుగా కనిపించింది. కానీ ఎన్నికలు అయిన ఆర్నెల్ల తర్వాత ఆయన మనసు మారింది. మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు.
ఐతే సినిమాలకు మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా.. రాజకీయాల్లో కొనసాగుతూనే రెండేళ్ల వ్యవధిలో వీలు చిక్కినపుడల్లా షూటింగ్కు సమయం కేటాయిస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకున్నాడు. ఆ ప్రకారమే ముందుగా ‘వకీల్ సాబ్’ను మొదలుపెట్టి శరవేగంగా సినిమాను పూర్తి చేయాలని చూశాడు. కానీ కరోనా వచ్చి ఆయన ప్రయత్నానికి అడ్డం పడింది. మరోవైపు ఒక షెడ్యూల్ తర్వాత క్రిష్ సినిమా కూడా ఆగిపోయింది.
ఇప్పుడిక పవన్ ఎప్పుడు మళ్లీ షూటింగ్కు వస్తాడో.. ఈ రెండు చిత్రాల్లో దేనికి ఎలా డేట్లు కేటాయిస్తాడో అర్థం కాకుండా ఉంది. మరోవైపు క్రిష్ ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే.. మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కలయికలో ఓ సినిమాను మొదలుపెట్టాడు. దీంతో పవన్తో క్రిష్ సినిమా మీద అయోమయం నెలకొంది. ఈ విషయమై తాజాగా మీడియాకు సమాచారం ఇచ్చాడు క్రిష్.
తనతో పవన్ చేస్తున్న సినిమా విషయంలో తొందర లేదని.. ఆయన ముందు ‘వకీల్ సాబ్’ పూర్తి చేయాలని.. ఆ తర్వాత వీలు చూసుకుని తమ సినిమాను పున:ప్రారంభిస్తామని క్రిష్ వెల్లడించాడు. ఈ లోపు తాను వైష్ణవ్ సినిమాను పూర్తి చేస్తానన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చాడు. ఇదిలా ఉండగా పవన్తో క్రిష్ సినిమాకు సంగీతం అందిస్తున్న కీరవాణే.. వైష్ణవ్-క్రిష్ సినిమాకు కూడా పని చేయనున్నాడన్నది తాజా సమాచారం.
This post was last modified on August 18, 2020 3:13 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…