Movie News

ప్రభాస్ కొత్త చిత్రం.. కొన్ని ముచ్చట్లు

ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియా అంతటా ప్రభాస్ కొత్త చిత్రం గురించే చర్చంతా. సౌత్, నార్త్ అని తేడా లేకుండా అందరు సినీ ప్రియులూ ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. ‘తానాజీ’ దర్శకుడు ఓమ్ రౌత్‌తో ప్రభాస్ జట్టు కట్టబోతున్నాడని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ‘ఆది పురుష్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి మరికొన్ని విశేషాలు కూడా బయటికి వచ్చాయి.

ఇది బేసిగ్గా హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమా. ప్రభాస్ తొలి బాలీవుడ్ మూవీ అయినప్పటికీ.. దాన్ని కేవలం హిందీలో తీసి మిగతా భాషల్లాగే తెలుగులోనూ అనువాదం చేయాలని అనుకోవట్లేదు. ప్రభాస్‌ సొంత భాషను విస్మరిస్తే అతడి ఫ్యాన్స్ కచ్చితంగా ఫీలవుతారు. అందుకే పక్కా తెలుగు సినిమా అనిపించేలా ప్రతి సన్నివేశాన్నీ తెలుగులో తీయబోతున్నారు. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రం అనువాదమే చేయబోతున్నారు. మరికొన్ని అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా రిలీజవుతుందని సమాచారం.

ఇక ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్‌తో కలిసి భూషణ్ కుమార్ నిర్మించబోతున్నాడు. ఆయన ప్రభాస్ చివరి సినిమా ‘సాహో’తో పాటు ‘రాధేశ్యామ్’ను కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నాడు. ‘ఆది పురుష్’ బడ్జెట్ రూ.300 కోట్లకు పైమాటే అని సమాచారం. ‘రామాయణం’ కథకు ఇది అడాప్షన్ అని.. చెడు మీద మంచి విజయం సాధించడం అనే కాన్సెప్ట్ నేపథ్యంలో ఇది సాగుతుందని దీని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది.

రాముడు, రావణుడు, ఆంజనేయుడు పాత్రలు టైటిల్ పోస్టర్లో కనిపించాయి. ఆ పురాణ పురుషుల్ని తలపించే పాత్రలు సినిమాలో కనిపిస్తాయి. ప్రభాస్‌ది రాముడి తరహా పాత్ర అన్నది స్పష్టం. మరి రావణుడెవరన్నది ఆసక్తికరం. ఒక బాలీవుడ్ టాప్ స్టార్‌తో ఈ పాత్ర కోసం సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇక ఈ చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కించబోతుండటం మరో విశేషం.

This post was last modified on August 18, 2020 2:20 pm

Share
Show comments
Published by
Satya
Tags: Prabhas

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago