Movie News

ప్రభాస్ కొత్త చిత్రం.. కొన్ని ముచ్చట్లు

ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియా అంతటా ప్రభాస్ కొత్త చిత్రం గురించే చర్చంతా. సౌత్, నార్త్ అని తేడా లేకుండా అందరు సినీ ప్రియులూ ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. ‘తానాజీ’ దర్శకుడు ఓమ్ రౌత్‌తో ప్రభాస్ జట్టు కట్టబోతున్నాడని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ‘ఆది పురుష్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి మరికొన్ని విశేషాలు కూడా బయటికి వచ్చాయి.

ఇది బేసిగ్గా హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమా. ప్రభాస్ తొలి బాలీవుడ్ మూవీ అయినప్పటికీ.. దాన్ని కేవలం హిందీలో తీసి మిగతా భాషల్లాగే తెలుగులోనూ అనువాదం చేయాలని అనుకోవట్లేదు. ప్రభాస్‌ సొంత భాషను విస్మరిస్తే అతడి ఫ్యాన్స్ కచ్చితంగా ఫీలవుతారు. అందుకే పక్కా తెలుగు సినిమా అనిపించేలా ప్రతి సన్నివేశాన్నీ తెలుగులో తీయబోతున్నారు. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రం అనువాదమే చేయబోతున్నారు. మరికొన్ని అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా రిలీజవుతుందని సమాచారం.

ఇక ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్‌తో కలిసి భూషణ్ కుమార్ నిర్మించబోతున్నాడు. ఆయన ప్రభాస్ చివరి సినిమా ‘సాహో’తో పాటు ‘రాధేశ్యామ్’ను కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నాడు. ‘ఆది పురుష్’ బడ్జెట్ రూ.300 కోట్లకు పైమాటే అని సమాచారం. ‘రామాయణం’ కథకు ఇది అడాప్షన్ అని.. చెడు మీద మంచి విజయం సాధించడం అనే కాన్సెప్ట్ నేపథ్యంలో ఇది సాగుతుందని దీని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది.

రాముడు, రావణుడు, ఆంజనేయుడు పాత్రలు టైటిల్ పోస్టర్లో కనిపించాయి. ఆ పురాణ పురుషుల్ని తలపించే పాత్రలు సినిమాలో కనిపిస్తాయి. ప్రభాస్‌ది రాముడి తరహా పాత్ర అన్నది స్పష్టం. మరి రావణుడెవరన్నది ఆసక్తికరం. ఒక బాలీవుడ్ టాప్ స్టార్‌తో ఈ పాత్ర కోసం సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇక ఈ చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కించబోతుండటం మరో విశేషం.

This post was last modified on August 18, 2020 2:20 pm

Share
Show comments
Published by
Satya
Tags: Prabhas

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago