మాములుగా మనది కాని భాషలో నటించేటప్పుడు హీరో హీరోయిన్లు డబ్బింగ్ విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోరు. వేరేవాళ్ళతో చెప్పిస్తారని లైట్ తీసుకుని జస్ట్ లిప్ మూమెంట్ తో పని కానిచ్చేస్తారు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు సైతం కొందరిలో ఇదే ధోరణి కనిపిస్తుంది. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ఈ విషయంలో చాలా స్పెషల్ అనిపిస్తాడు. స్క్రీన్ వెనుక ఖచ్చితంగా నా గొంతే వినిపించాలనే పట్టుదల ఇతనిది. కనులు కనులను దోచాయంటే లాంటి అనువాద చిత్రమైనా, మహానటి లాంటి స్ట్రెయిట్ మూవీ అయినా ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటాడు.
ఇవన్నీ ఒక ఎత్తయితే వెబ్ సిరీస్ లకు కూడా మినహాయింపు ఇవ్వట్లేదు ఈ కుర్ర హీరో. నెట్ ఫ్లిక్స్ లో త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న గన్స్ అండ్ గులాబ్స్ లో తెలుగుతో సహా మిగిలిన లాంగ్వేజెస్ లోనూ తన గాత్రమే అందించాడు. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ సృష్టికర్తలు రాజ్ అండ్ డికె దీనికి దర్శకత్వం వహించారు. 70 దశకంలో జరిగిన సంఘటనల ఆధారంగా నలుగురు కుర్రాళ్ళ మధ్య క్రైమ్ కామెడీ డ్రామాగా దీన్ని రూపొందించారు. ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. రాజ్ కుమార్ రావు లాంటి వాళ్ళు ఇందులో భాగమయ్యారు. బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టి రూపొందించారు.
పొగడటం అని కాదు కానీ దుల్కర్ కు ఈ పట్టుదల తండ్రి మమ్ముట్టి నుంచి వచ్చింది. ఆయన దళపతి, స్వాతి కిరణం, సూర్య పుత్రులు, యాత్ర సినిమాలకు తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పారు తప్పించి ఎవరో ఒకరు మేనేజ్ చేస్తారని వదిలేయలేదు. ఇప్పుడు వారసుడు కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. ఇలా చేయడం వల్ల సహజత్వం పెరిగి ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడానికి అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార బ్యానర్ లో లక్కీ భాస్కర్ చేస్తున్న దుల్కర్ సల్మాన్ తెలుగులో క్రమం తప్పకుండా స్ట్రెయిట్ సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…