మాములుగా మనది కాని భాషలో నటించేటప్పుడు హీరో హీరోయిన్లు డబ్బింగ్ విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోరు. వేరేవాళ్ళతో చెప్పిస్తారని లైట్ తీసుకుని జస్ట్ లిప్ మూమెంట్ తో పని కానిచ్చేస్తారు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు సైతం కొందరిలో ఇదే ధోరణి కనిపిస్తుంది. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ఈ విషయంలో చాలా స్పెషల్ అనిపిస్తాడు. స్క్రీన్ వెనుక ఖచ్చితంగా నా గొంతే వినిపించాలనే పట్టుదల ఇతనిది. కనులు కనులను దోచాయంటే లాంటి అనువాద చిత్రమైనా, మహానటి లాంటి స్ట్రెయిట్ మూవీ అయినా ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటాడు.
ఇవన్నీ ఒక ఎత్తయితే వెబ్ సిరీస్ లకు కూడా మినహాయింపు ఇవ్వట్లేదు ఈ కుర్ర హీరో. నెట్ ఫ్లిక్స్ లో త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న గన్స్ అండ్ గులాబ్స్ లో తెలుగుతో సహా మిగిలిన లాంగ్వేజెస్ లోనూ తన గాత్రమే అందించాడు. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ సృష్టికర్తలు రాజ్ అండ్ డికె దీనికి దర్శకత్వం వహించారు. 70 దశకంలో జరిగిన సంఘటనల ఆధారంగా నలుగురు కుర్రాళ్ళ మధ్య క్రైమ్ కామెడీ డ్రామాగా దీన్ని రూపొందించారు. ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. రాజ్ కుమార్ రావు లాంటి వాళ్ళు ఇందులో భాగమయ్యారు. బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టి రూపొందించారు.
పొగడటం అని కాదు కానీ దుల్కర్ కు ఈ పట్టుదల తండ్రి మమ్ముట్టి నుంచి వచ్చింది. ఆయన దళపతి, స్వాతి కిరణం, సూర్య పుత్రులు, యాత్ర సినిమాలకు తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పారు తప్పించి ఎవరో ఒకరు మేనేజ్ చేస్తారని వదిలేయలేదు. ఇప్పుడు వారసుడు కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. ఇలా చేయడం వల్ల సహజత్వం పెరిగి ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడానికి అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార బ్యానర్ లో లక్కీ భాస్కర్ చేస్తున్న దుల్కర్ సల్మాన్ తెలుగులో క్రమం తప్పకుండా స్ట్రెయిట్ సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…