Movie News

అనవసరంగా అజిత్ అభిమానులను గిల్లారు

సోషల్ మీడియా జమానాలో ఏదైనా మాట్లాడేటప్పుడు సెలబ్రిటీలు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఉండటం అవసరం. లేదంటే ట్రోలింగ్ బ్యాచులకు దొరికిపోవడం ఖాయం. ఇవాళ మీడియాతో ప్రెస్ మీట్ పెట్టిన భోళా దర్శకుడు మెహర్ రమేష్ అన్న మాటలు అజిత్ ఫ్యాన్స్ ని అనవసరంగా గిల్లేశాయి. రీమేకుల ప్రస్తావన వచ్చినప్పుడు వేదాళంలో పదింతలు ఎక్కువ క్రింజ్ ఉంటుందని, అదంతా తాను తీయలేదని, అవసరమైన మార్పులు చేర్పులు చేసి నా స్టైల్ లో చిరంజీవిని ప్రెజెంట్ చేశానని చెప్పుకొచ్చాడు. సరే కంటెంట్ మీద నమ్మకంతో మన గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు.

కానీ వేదాళంని మరీ తీసిపారేయలేం. నిజంగా అందులో అంత రొట్ట మాస్ ఉంటే మెగాస్టార్ చూసిన వెంటనే నో చెప్పేవారుగా. సో తనకు సూటయ్యే కంటెంట్ ఉందని భావించడం వల్లే ఓకే చెప్పారు. అలాంటప్పుడు అజిత్ మూవీని  తక్కువ చేయడం కరెక్ట్ కాదనేది నెటిజెన్ల అభిప్రాయం. వేదాళం రిలీజయినపుడు తమిళనాడుని వరదలు ముంచెత్తుతున్నాయి. అయినా సరే మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ సాధించింది. ఆ ఏడాది టాప్ లో నిలబడింది. మన ఆడియన్స్ సైతం అందుబాటులో ఉన్న టైంలో ఆన్ లైన్లో చూసి బాగుందని మెచ్చుకుని ట్వీట్లు గట్రా పెట్టారు.

మా సినిమానే క్రింజ్ అంటావాని అజిత్ అభిమానులు మెల్లగా మెహర్ గత చిత్రాలు షాడో, శక్తి తాలూకు వీడియోలు బయటికి తీసి ఇదేంటో చెబుతావా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మాములుగానే వాళ్లకు ప్రాంతీయాభిమానం, హీరోల మీద ఆరాధనాభావం ఎక్కువ. అలాంటిది ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తే ఎంతటి ట్రోలింగ్ కైనా తెగబడతారు. ఒకవేళ భోళా శంకర్ బ్లాక్ బస్టర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. నేను చెప్పింది కరెక్టే కదాని సర్దిచెప్పుకోవచ్చు. రిలీజయ్యాక ఫలితం చూసి చెప్పి ఉంటే బాగుండేది. కొంచెం తొందరపడినట్టుగానే కనిపిస్తోంది. దీని ఎఫెక్ట్ తక్కువగా ఉంటేనే బెటర్.

Satya

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

8 minutes ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

1 hour ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

1 hour ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

2 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 hours ago