మెగా స్టార్ చిరంజీవి , సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇద్దరూ ఈ వారం బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో పోటీ పడబోతున్నారు. చిరంజీవి ఆగస్ట్ 11న ‘భోళా శంకర్’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమాకి ఒక్కరోజు ముందు రజినీ కాంత్ తన ‘జైలర్’ తో థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై అంచనాలు ఉన్నాయి. కాకపోతే భోళా శంకర్ కంటే జైలర్ మీద కాస్త ఎక్కువ అంచనాలు ఉన్నాయి. డానికి రీజన్ నెల్సన్ కట్ చేసిన ట్రైలర్.
ఈ సినిమాలకు బజ్ ఎలా ఉందనేది పక్కన పెడితే , సీనియర్లకి మాత్రం బాగా కలిసొచ్చేలా ఉంది. వీకెండ్ తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా ఈ మధ్య బాగా డ్రాప్ చూస్తున్నాం. అయితే జైలర్ , భోళా శంకర్ లకు వీకెండ్ తర్వాత ఆగస్ట్ 15 హాలిడే కలిసొచ్చేలా కనిపిస్తుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సోమవారం సెలవు పెట్టుకుంటే వారికి లాంగ్ వీకెండ్ ఉంటుంది. వారికి సినిమా టైమ్ పాస్ కాబట్టి కచ్చితంగా ఆ రెండ్రోజులు ఈ సినిమాలకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఇండిపెండెన్స్ డే హాలిడే కాబట్టి ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది.
ఏదేమైనా వీకెండ్ తర్వాత పబ్లిక్ హాలిడే రావడం చిరు , రజినీలకు బాగా కలిసొచ్చే అంశం. ఇక రజినీ నుండి వచ్చిన ప్రీవీయస్ మూవీస్ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచాయి. చిరు మాత్రం వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు భోళా శంకర్ గా రాబోతున్నాడు. మరి ఈ పోటీలో బాక్సాఫీస్ దగ్గర పై చేయి సాదించేది ఎవరో ? చూడాలి.
This post was last modified on August 8, 2023 9:05 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…