మెగా స్టార్ చిరంజీవి , సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇద్దరూ ఈ వారం బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో పోటీ పడబోతున్నారు. చిరంజీవి ఆగస్ట్ 11న ‘భోళా శంకర్’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమాకి ఒక్కరోజు ముందు రజినీ కాంత్ తన ‘జైలర్’ తో థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై అంచనాలు ఉన్నాయి. కాకపోతే భోళా శంకర్ కంటే జైలర్ మీద కాస్త ఎక్కువ అంచనాలు ఉన్నాయి. డానికి రీజన్ నెల్సన్ కట్ చేసిన ట్రైలర్.
ఈ సినిమాలకు బజ్ ఎలా ఉందనేది పక్కన పెడితే , సీనియర్లకి మాత్రం బాగా కలిసొచ్చేలా ఉంది. వీకెండ్ తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా ఈ మధ్య బాగా డ్రాప్ చూస్తున్నాం. అయితే జైలర్ , భోళా శంకర్ లకు వీకెండ్ తర్వాత ఆగస్ట్ 15 హాలిడే కలిసొచ్చేలా కనిపిస్తుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సోమవారం సెలవు పెట్టుకుంటే వారికి లాంగ్ వీకెండ్ ఉంటుంది. వారికి సినిమా టైమ్ పాస్ కాబట్టి కచ్చితంగా ఆ రెండ్రోజులు ఈ సినిమాలకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఇండిపెండెన్స్ డే హాలిడే కాబట్టి ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ కి వచ్చే ఛాన్స్ ఉంది.
ఏదేమైనా వీకెండ్ తర్వాత పబ్లిక్ హాలిడే రావడం చిరు , రజినీలకు బాగా కలిసొచ్చే అంశం. ఇక రజినీ నుండి వచ్చిన ప్రీవీయస్ మూవీస్ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచాయి. చిరు మాత్రం వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు భోళా శంకర్ గా రాబోతున్నాడు. మరి ఈ పోటీలో బాక్సాఫీస్ దగ్గర పై చేయి సాదించేది ఎవరో ? చూడాలి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…