Movie News

లియో కథలో సీక్వెల్ ట్విస్టు

బాహుబలి, కెజిఎఫ్ పుణ్యమాని సీక్వెల్ ఒక సక్సెస్ ఫుల్ ఫార్ములాగా మారిపోయిన తర్వాత అందరూ అదే బాట పడుతున్నారు. పుష్పకు ఇది ఎంత బాగా కలిసి వచ్చిందంటే సెకండ్ పార్ట్ కోసం నార్త్ ఆడియన్స్ ఎగబడేంతగా. క్రేజీ కాంబోలు, వందల కోట్ల బడ్జెట్ లు ఉంటే చాలు ఖచ్చితంగా కొనసాగింపు ఉండేలా దర్శక రచయితలు ప్లాన్ చేసుకుంటున్నారు. దీని వల్ల ఒకే దెబ్బకు రెండు పిట్టల తరహాలో డబుల్ బిజినెస్ తో పాటు రెట్టింపు లాభాలు అందుకోవచ్చు. అందుకే సలార్ సైతం ఇదే బాట పట్టేసి ఏకంగా రెండు వేల కోట్లను టార్గెట్ చేసుకుందన్న మాట వాస్తవం.

ఇప్పుడీ ఫీవర్ విజయ్ కు పాకిపోయింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న లియోని రెండు భాగాల్లో రూపొందిస్తున్నారని లేటెస్ట్ అప్డేట్. తొలుత ఈ విషయాన్ని గుట్టుగా ఉంచాలనుకున్నప్పటికీ పలు వర్గాల ద్వారా లీకైపోవడంతో ఏ క్షణమైనా అఫీషియల్ చేసే అవకాశాలున్నాయి. వచ్చే అక్టోబర్ 20న విడుదల కాబోతున్న లియోకు బిజినెస్ పరంగా చాలా క్రేజ్ నెలకొంది. ఎప్పుడూ లేనిది తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం సితార సంస్థ ఏకంగా 21 కోట్లకు కొనడం ఎంత హాట్ టాపిక్ గా మారిందో చూశాం. ఇప్పుడీ ఫిగర్ రెండు పార్ట్స్ కి కలిపా లేక విడిగానా అనేది తెలియాల్సి ఉంది.

విక్రమ్ తర్వాత లోకేష్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో లియో మీద మాములు అంచనాలు లేవు. ఇతని గత చిత్రాలు ఖైదీ, విక్రమ్ లతో లింక్ కలిసేలా కథాకథనాలు ఉంటాయనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో తెలియాలంటే ఇంకో రెండు నెలలకు పైగా ఎదురు చూడాలి. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ఆడియో నుంచి రిలీజైన ఒక సాంగ్ భీభత్సంగా కాదు కానీ జనానికి బాగానే ఎక్కేసింది. విజయ్ నటిస్తున్న మొట్టమొదటి టూ పార్ట్ మూవీ ఇదే అవుతుంది. హీరోయిన్ త్రిష, విలన్ సంజయ్ దత్ లాంటి ఆకర్షణలు లియోలో బోలెడున్నాయి . భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావులతో క్లాష్ కు సిద్ధమవుతోంది. 

This post was last modified on August 8, 2023 6:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

57 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago