Movie News

దిల్ రాజుని ఇమిటేట్ చేసిన చిరు

ఈ మధ్య సెలబ్రిటీస్ ట్రెండ్ పట్టుకుంటూ సోషల్ మీడియాలో వాడే మాటలను తమ నోటి నుండి చెప్పడం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో వైరల్ అయిన కంటెంట్ స్టార్ హీరోలు చెప్తే రీచ్ కూడా అలానే ఉంటుంది. తాజాగా మెగా స్టార్ చిరు కూడా అదే చేశారు. భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీం తో కలిసి చిరు ఓ ఇంటర్వ్యూ చేశారు. అందులో దిల్ రాజు ట్రోలింగ్ కి గురైన ఒకప్పటి మాటలను చిరు చెప్పడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. 

విజయ్ తో తమిళ్ లో వారిసు అనే సినిమా నిర్మించిన దిల్ రాజు చెన్నై లో ఆ సినిమా ఈవెంట్ లో విజయ్ ఫ్యాన్స్ ను మెప్పించడం కోసం వచ్చి రాని భాషతో ఓ స్పీచ్ ఇచ్చాడు. అందులో అదిదా సార్ అనే వర్డ్ పాపులర్ అయింది. ఆ స్పీచ్ పట్టుకొని దిల్ రాజు ను సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ చేశారు. అయితే దిల్ రాజు మాట్లాడిన తమిళ్ పదాలను చిరు ఇంటర్వ్యూ లో తన నోటితో చెప్తూ అదిదా సార్ నేనే అంటూ చెప్పుకోవడం దాన్ని ప్రోమోలో రిలీజ్ చేయడంతో చిరు నోట దిల్ రాజు మాట అంటూ నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. 

ఇక చిరు సినిమా రిలీజ్ కి ఇంకా మూడు రోజులే ఉంది. సినిమాకి హైప్ తీసుకొచ్చేందుకు టీం నానా రకాలుగా కష్టపడుతూనే ఉన్నారు. వేదాళం కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో పెద్ద అంచనాలు లేవు. బుకింగ్స్ లో కూడా భోళా ఆశించిన స్థాయిలో జోరు చూపించడం లేదు. సినిమా టాక్ మీదే కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయి.

This post was last modified on August 8, 2023 6:02 pm

Share

Recent Posts

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

20 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

1 hour ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

2 hours ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

5 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

6 hours ago