ఇంకో నాలుగున్నర నెలల్లో 2024 సంక్రాంతి వచ్చేస్తుంది. టాలీవుడ్ కు అత్యంత కీలకమైన ఈ సీజన్ కోసం హీరోలు నిర్మాతలు ఎంతగా తపించిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా పోటీలో ఎవరుంటారనేది మాత్రం అంత సులభంగా తేలే వ్యవహారంలా కనిపించడం లేదు. ‘ప్రాజెక్ట్ కె’ని జనవరి 12 రిలీజ్ చేస్తామని వైజయంతి గతంలోనే ప్రకటించింది. అయితే షూటింగ్ ఇంకా చాలా బాలన్స్ ఉంది కాబట్టి అది రాదనే నమ్మకంతో రవితేజ ‘ఈగల్’తో పాటు విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్'(ప్రచారంలో ఉన్న టైటిల్)లు ముందు జాగ్రత్తగా కర్చీఫ్ వేసి పెట్టాయి .
ఇక మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఖచ్చితంగా వచ్చేది లేనిది రేపు హీరో పుట్టినరోజు యూనిట్ వదిలే స్పెషల్ పోస్టర్ లో ఏదైనా క్లారిటీ ఇవ్వొచ్చు. నిర్మాత నాగవంశీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కానీ ఈ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న వాయిదాలు, మార్పులు ఎవరినీ నమ్మించేలా లేవు. నవంబర్ లో ఒక స్పష్టత రావొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన బలంగా రూపొందిన ‘హనుమాన్’ సైతం 12కే రావాలని లాక్ చేసుకుంది. తేజ సజ్జ లాంటి చిన్న హీరో ఉన్నప్పటికీ దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా ధీమాగా ఉన్నాడు. చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబో మూవీ దింపాలనుకున్నారు అసలింకా షూటింగే మొదలవ్వలేదు.
ఇక్కడ చెప్పిన వాటిలో నూటికి నూరు శాతం ఛాన్స్ ఉన్నది ముందుగా ఈగల్ కు మాత్రమే. ఇది షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. తర్వాత హనుమాన్ ఉంది. మిగిలినవి రకరకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉండటంతో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి నెలకొంది. బయ్యర్లు మాత్రం కనీసం రెండు నెలల ముందు చెప్పకపోతే థియేటర్ల సర్దుబాటు ఇబ్బందవుతుందని, నిర్మాతలకు ఇచ్చిన అడ్వాన్సులకు బయట వడ్డీలు ఎప్పటిదాకా కట్టాలో అర్థం కాదని వాపోతున్నారు. ఒకటి రెండు సినిమాలు తప్పుకోవడం ఖరారే కానీ అవేంటనేది తేలాలంటే ఇంకొంత వెయిటింగ్ తప్పదు మరి.
This post was last modified on August 8, 2023 1:13 pm
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…
రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు.. కాంగ్రెస్కు పడ్డాయా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.…