ఇంకో నాలుగున్నర నెలల్లో 2024 సంక్రాంతి వచ్చేస్తుంది. టాలీవుడ్ కు అత్యంత కీలకమైన ఈ సీజన్ కోసం హీరోలు నిర్మాతలు ఎంతగా తపించిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా పోటీలో ఎవరుంటారనేది మాత్రం అంత సులభంగా తేలే వ్యవహారంలా కనిపించడం లేదు. ‘ప్రాజెక్ట్ కె’ని జనవరి 12 రిలీజ్ చేస్తామని వైజయంతి గతంలోనే ప్రకటించింది. అయితే షూటింగ్ ఇంకా చాలా బాలన్స్ ఉంది కాబట్టి అది రాదనే నమ్మకంతో రవితేజ ‘ఈగల్’తో పాటు విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్'(ప్రచారంలో ఉన్న టైటిల్)లు ముందు జాగ్రత్తగా కర్చీఫ్ వేసి పెట్టాయి .
ఇక మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఖచ్చితంగా వచ్చేది లేనిది రేపు హీరో పుట్టినరోజు యూనిట్ వదిలే స్పెషల్ పోస్టర్ లో ఏదైనా క్లారిటీ ఇవ్వొచ్చు. నిర్మాత నాగవంశీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కానీ ఈ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న వాయిదాలు, మార్పులు ఎవరినీ నమ్మించేలా లేవు. నవంబర్ లో ఒక స్పష్టత రావొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన బలంగా రూపొందిన ‘హనుమాన్’ సైతం 12కే రావాలని లాక్ చేసుకుంది. తేజ సజ్జ లాంటి చిన్న హీరో ఉన్నప్పటికీ దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా ధీమాగా ఉన్నాడు. చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబో మూవీ దింపాలనుకున్నారు అసలింకా షూటింగే మొదలవ్వలేదు.
ఇక్కడ చెప్పిన వాటిలో నూటికి నూరు శాతం ఛాన్స్ ఉన్నది ముందుగా ఈగల్ కు మాత్రమే. ఇది షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. తర్వాత హనుమాన్ ఉంది. మిగిలినవి రకరకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉండటంతో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి నెలకొంది. బయ్యర్లు మాత్రం కనీసం రెండు నెలల ముందు చెప్పకపోతే థియేటర్ల సర్దుబాటు ఇబ్బందవుతుందని, నిర్మాతలకు ఇచ్చిన అడ్వాన్సులకు బయట వడ్డీలు ఎప్పటిదాకా కట్టాలో అర్థం కాదని వాపోతున్నారు. ఒకటి రెండు సినిమాలు తప్పుకోవడం ఖరారే కానీ అవేంటనేది తేలాలంటే ఇంకొంత వెయిటింగ్ తప్పదు మరి.
This post was last modified on August 8, 2023 1:13 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…