టికెట్ రేట్లు, అదనపు షోల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల సినీ పరిశ్రమ ఎంత అసంతృప్తిగా ఉందో దాచి పెట్టేది కాదు. బాహాటంగా ఎవరూ బయటికి చెప్పకపోయినా ఇండస్ట్రీ పెద్దలు కలుసుకున్నప్పుడు దీని గురించిన ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఆ మధ్య చిరంజీవి టాలీవుడ్ స్టార్ హీరోలను వెంటతీసుకెళ్లి జగన్ కు నమస్కారం పెట్టి మరీ సమస్యల పరిష్కారానికి విన్నవించుకోవడం మర్చిపోయేది కాదు. అయితే ఏపీ సర్కారు ధోరణి గురించి ఏనాడూ పెద్దగా ఓపెన్ గా మాట్లాడని మెగాస్టార్ మూడు రోజుల్లో భోళా శంకర్ రిలీజ్ ఉండగా ఇన్ డైరెక్టర్ గా హితబోధ చేశారు.
నిన్న సాయంత్రం వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుక జరిగింది. మీడియా, అభిమానులు ఎవరూ లేకుండా కేవలం టీమ్ మెంబర్స్ మాత్రమే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ గవర్నమెంట్ లు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల పూర్తి, యువతకు ఉద్యోగాలు తదితర అంశాల మీద దృష్టి పెట్టాలి తప్పించి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమాల మీద కాదని అన్నారు. తెలంగాణ వైపు నుంచి ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు. ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్ అందులోనూ పవన్ కళ్యాణ్ రిలీజులున్నప్పుడు ఎక్కువ ఈ సమస్య రిపీట్ అవుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో చిరంజీవి కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమను పల్లెత్తు మాట అన్నా ఊరుకొని వైసిపి గణం ఇప్పుడు ఊరికే ఉంటుందా లేక మళ్ళీ తమ్ముడిని టార్గెట్ చేసుకుని అన్నయ్యని తూలనాడతారా అనేది వేచి చూడాలి. అయినా హఠాత్తుగా చిరు ఈ విషయాల గురించి మాట్లాడ్డం చూసి వచ్చినవారంతా ఆశ్చర్యపోయారు. వాల్తేరు వీరయ్య విశేషాల గురించి చెబుతారనుకుంటే అనూహ్యంగా ఇలా పొలిటికల్ ఇష్యూస్ టచ్ చేయడం షాక్ ఇచ్చింది. టికెట్ రేట్ల పెంపు కోసం భోళా శంకర్ అప్లికేషన్ పెట్టిన టైంలో ఇలా జరగడం ఏ పరిణామాలకు దారి తీస్తుందో.
This post was last modified on August 8, 2023 11:50 am
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…