ప్రభాస్ కొత్త చిత్రాల్లో అత్యధిక అంచనాలున్నది ‘కల్కి 2898 ఏడీ’ మీదే. ఇటీవలే రిలీజైన ట్రైలర్ చూశాక అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇది హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుందని.. ప్రభాస్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ అయిపోతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఐతే ఈ సినిమా రిలీజ్ విషయంలో చాన్నాళ్లుగా సందిగ్ధత నెలకొంది. ముందు 2024 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ.. ఆ డేట్ను అందుకోవడం అసాధ్యం అనే సంకేతాలు కనిపించాయి.
2024 వేసవి లేదా ఆ ఏడాది ద్వితీయార్దంలో రిలీజ్ ఉంటుందని అనుకున్నారు. కానీ మధ్యలో సంక్రాంతి డేట్ మీదే టీం దృష్టిపెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా గందరగోళానికి గురవుతున్నారు. ఐతే ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో దర్శకుడు నాగ్ అశ్వినే స్వయంగా చెప్పే ప్రయత్నం చేశాడు.
ఒక ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ కొంత భాగమే మిగిలి ఉంది. త్వరలోనే పూర్తి చేస్తాం. ప్రస్తుతం నా ఏకాగ్రత మొత్తం దాని మీదే ఉంది. ఆ పని పూర్తయ్యాక విడుదల తేదీ గురించి ఆలోచిస్తాం. ఒక మంచి రోజు చూసుకుని నేనే దాని గురించి ప్రకటిస్తా’’ అని పేర్కొన్నాడు.
‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అందరూ ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారని.. ఇప్పటి వరకు ప్రభాస్ను చూడని లుక్లో చూస్తారని.. అందుకోసమైనా ప్రేక్షకులంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని.. ఆడియన్స్ ఒక కొత్త అనుభూతిని పొందుతారని నాగ్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కమల్ హాసన్ ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on August 8, 2023 11:26 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…