టాలీవుడ్లో ఏడాదిగా రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో చూస్తున్నాం. ఈ ట్రెండుకు శ్రీకారం చుట్టిందే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు. సరిగ్గా ఏడాది కిందట మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని ‘పోకిరి’ సినిమాకు ఎవ్వరూ ఊహించని స్థాయిలో వందల సంఖ్యలో స్పెషల్ షోలు ప్లాన్ చేయడం.. అవన్నీ చాలా వరకు హౌస్ ఫుల్స్తో రన్ కావడం.. వసూళ్లు కోటిన్నర దాటిపోవడం.. థియేటర్ల దగ్గర కొత్త సినిమాలను మించిన హడావుడి కనిపించడం చూసి అందరూ షాకైపోయారు.
పాత సినిమాతో ఇదేం మోత అనుకున్నారు. ఆ తర్వాత వేరే హీరోల ఫ్యాన్స్లోనూ ఆశలు పుట్టాయి. ఇలా పలు చిత్రాలు రీ రిలీజ్లో వసూళ్ల మోత మోగించాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు జల్సా, ఖుషి సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టాయి. రీ రిలీజ్లో చాలా వరకు రికార్డులన్నీ పవన్ సినిమాల మీదే ఉన్నాయిప్పుడు.
ఐతే మహేష్ అభిమానులు మళ్లీ రికార్డులు తిరగరాసే పనిలో పడ్డట్లే కనిపిస్తున్నారు. ఈసారి సూపర్ స్టార్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘బిజినెస్మేన్’ రీ రిలీజ్కు ప్లాన్ చేశారు. మహేష్ సినిమాల్లో అభిమానులు అత్యంత నచ్చే చిత్రాల్లో ఇదొకటి. ఇందులో మహేష్ పాత్ర.. దాని చిత్రణ.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్.. డైలాగులు.. ఇవన్నీ ఒక రేంజిలో ఉంటాయి. థియేటర్లలో అభిమానుల సందడిని పీక్స్కు తీసుకెళ్లే స్కోప్ ఉన్న సినిమా ఇది.
రిలీజ్ ప్లానింగ్ భారీగానే జరగడం.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజిలో నడుస్తుండటంతో రీరిలీజ్ రికార్డులన్నీ బద్దలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేవలం హైదరాబాద్లోనే అడ్వాన్స్ బుకింగ్స్తో ఆల్రెడీ ఈ సినిమా కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిందంటే ‘బిజినెస్ మేన్’ జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి రీ రిలీజ్లో ఫుల్ రన్ అయ్యేలోపు మహేష్ సినిమా ఇంకెంత సంచలనం రేపుతుందో చూడాలి.
This post was last modified on August 8, 2023 10:36 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…