టాలీవుడ్లో ఏడాదిగా రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో చూస్తున్నాం. ఈ ట్రెండుకు శ్రీకారం చుట్టిందే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు. సరిగ్గా ఏడాది కిందట మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని ‘పోకిరి’ సినిమాకు ఎవ్వరూ ఊహించని స్థాయిలో వందల సంఖ్యలో స్పెషల్ షోలు ప్లాన్ చేయడం.. అవన్నీ చాలా వరకు హౌస్ ఫుల్స్తో రన్ కావడం.. వసూళ్లు కోటిన్నర దాటిపోవడం.. థియేటర్ల దగ్గర కొత్త సినిమాలను మించిన హడావుడి కనిపించడం చూసి అందరూ షాకైపోయారు.
పాత సినిమాతో ఇదేం మోత అనుకున్నారు. ఆ తర్వాత వేరే హీరోల ఫ్యాన్స్లోనూ ఆశలు పుట్టాయి. ఇలా పలు చిత్రాలు రీ రిలీజ్లో వసూళ్ల మోత మోగించాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు జల్సా, ఖుషి సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టాయి. రీ రిలీజ్లో చాలా వరకు రికార్డులన్నీ పవన్ సినిమాల మీదే ఉన్నాయిప్పుడు.
ఐతే మహేష్ అభిమానులు మళ్లీ రికార్డులు తిరగరాసే పనిలో పడ్డట్లే కనిపిస్తున్నారు. ఈసారి సూపర్ స్టార్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘బిజినెస్మేన్’ రీ రిలీజ్కు ప్లాన్ చేశారు. మహేష్ సినిమాల్లో అభిమానులు అత్యంత నచ్చే చిత్రాల్లో ఇదొకటి. ఇందులో మహేష్ పాత్ర.. దాని చిత్రణ.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్.. డైలాగులు.. ఇవన్నీ ఒక రేంజిలో ఉంటాయి. థియేటర్లలో అభిమానుల సందడిని పీక్స్కు తీసుకెళ్లే స్కోప్ ఉన్న సినిమా ఇది.
రిలీజ్ ప్లానింగ్ భారీగానే జరగడం.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజిలో నడుస్తుండటంతో రీరిలీజ్ రికార్డులన్నీ బద్దలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేవలం హైదరాబాద్లోనే అడ్వాన్స్ బుకింగ్స్తో ఆల్రెడీ ఈ సినిమా కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిందంటే ‘బిజినెస్ మేన్’ జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి రీ రిలీజ్లో ఫుల్ రన్ అయ్యేలోపు మహేష్ సినిమా ఇంకెంత సంచలనం రేపుతుందో చూడాలి.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…