గత నెల ఇండియన్ బాక్సాఫీస్ హాలీవుడ్ మూవీస్ కి బాగా కలిసి వచ్చింది. ఓపెన్ హెయిమర్ భారీ వసూళ్లతో విరుచుకుపడగా మిషన్ ఇంపాజిబుల్ 7 మంచి రెవిన్యూలతో సేఫ్ అయ్యింది. బార్బీని సైతం అర్బన్ సెంటర్ జనాలు బాగా ఆదరించారు. ఈ మూడు సినిమాలే రెండు వందల కోట్లకు పైగానే వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఈ ఊపులో మెగ్ 2 ది ట్రెంచ్ అనే మరో సినిమా మొన్న శుక్రవారం విడుదలయ్యింది. మన దేశంలో చెప్పుకోదగ్గ వేరే రిలీజులు లేకపోవడంతో ఆడియన్స్ దీని మీద ఓ లుక్ వేద్దామనుకున్నారు. త్రీడితో పాటు ఐమ్యాక్స్ వెర్షన్ ను కూడా విడుదల చేశారు.
ఇది 2018లో వచ్చిన సూపర్ హిట్ మెగ్ కి కొనసాగింపు. స్టార్ హీరో జాసన్ స్టాతమ్ ఈ సీక్వెల్ లోనూ నటించాడు. సముద్ర గర్భంలో ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తూ కొత్త జాతులను కనుక్కునేందుకు దిగిన కొన్ని కార్పొరేట్ శక్తులకు ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. దీంతో రంగంలోకి దిగిన జోనస్ టేలర్ ప్రాణాంతకమైన షార్క్ లను ఎలా అంతమొందించాడనే పాయింట్ మీద దర్శకుడు బెన్ వీట్లీ మెగ్ 2ని రూపొందించాడు. అయితే ఈసారి వెరైటీగా ఉంటుందని డైనోసార్లను తీసుకొచ్చి కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేశారు కానీ అది నెరవేరలేదు.
ఇంట్రో సీన్ ని బాగా డిజైన్ చేసినా ఆ తర్వాత క్రమంగా గ్రాఫ్ కిందకు వెళ్ళిపోయి చివరికి సీరియస్ గా ఉండాల్సిన క్లైమాక్స్ ని నవ్వులాటగా మార్చేశారు. రాకాసి బల్లులు, షార్క్ ల మధ్య ఏదో భీకర యుద్ధాలను ఊహించుకుంటే పప్పులో కాలేసినట్టే. అలాంటివి ఏమీ లేవు. జాసన్ తిమింగలాన్ని హతమార్చే ఎపిసోడ్ కూడా మన తెలుగు సినిమా స్టైల్ లో మాస్ గా పెట్టారు కానీ అది కూడా కామెడీ అయిపోయింది. అండర్ వాటర్ సన్నివేశాలు ఓవర్ ల్యాగ్ అయిపోయాయి. ఎంత ఓపిక ఉన్నా సరే ఇదేం సినిమారా బాబు అనుకునేలా ఫైనల్ గా తిమింగలం సినిమా తుస్సుమనిపించేసింది.
This post was last modified on August 7, 2023 6:09 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…