సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మీద అంచనాలు మాములుగా ఎగబాకడం లేదు. కావాలయ్యా పాట, ట్రైలర్ వచ్చిన స్పందన హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఒక్క బెంగళూరు ప్రాంతంలోనే రిలీజ్ ఇంకా మూడు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3 కోట్లకు పైగా వసూలు కావడం కొత్త రికార్డుగా చెబుతున్నారు. ఇప్పటిదాకా షెడ్యూల్ చేసిన 903 షోలకు గాను 75 వేల టికెట్లు అమ్ముడుపోగా ఎల్లుండి ఉదయానికి ఈ నెంబర్లు రెట్టింపు అయినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని మల్టీప్లెక్సులు అత్యథికంగా ఒక రిక్లైనర్ కు 1400 రూపాయలు అమ్మినా ఆడియన్స్ లెక్క చేయడం లేదు.
దెబ్బకు భోళా శంకర్ తో పాటు గదర్ 2, ఓ మై గాడ్ 2 బుకింగ్స్ మరీ నెమ్మదిగా కదలడం అసలు ట్విస్టు. కన్నడనేలపై చిరంజీవికి ఎంత ఫాలోయింగ్ ఉన్నా వేదాళం రీమేక్ అనే పాయింట్ జనంలో ఎగ్జైట్ మెంట్ ని తగ్గించేసింది. జైలర్ ఖచ్చితంగా బాగుంటుందనే ప్రీ టాక్ సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. దాని ఫలితంగానే అమ్మకాలు బాగున్నాయని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. చెన్నైలో తెల్లవారుఝామున స్పెషల్ షోలు ఉంటాయో లేదో ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ బెంగళూరులో మాత్రం అయిదు గంటల షోలు అప్పుడే సోల్డ్ అవుట్ బోర్డులు పెడుతున్నాయి .
చాలా కాలంగా బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ కు జైలర్ సక్సెస్ చాలా కీలకం. పెద్దన్న, పేట, కాల, కబాలి లాంటివి ఒరిజినల్ వెర్షన్లు కమర్షియల్ గా ఎంత పే చేసినా బయట రాష్ట్రాల్లో మాత్రం డిజాస్టరయ్యాయి. అందుకే జైలర్ కనక హిట్టు కొడితే తిరిగి తన మార్కెట్ ని సాధించుకోవచ్చనే నమ్మకంతో ఉన్నారు. బీస్ట్ ఫ్లాప్ అయినా దర్శకుఢు నెల్సన్ దిలీప్ కుమార్ బ్రాండ్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. కొడుకుని కిడ్నాప్ చేసిన ఒక కరుడు గట్టిన ముఠాతో పోరాడే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా రజనీకాంత్ నటించిన జైలర్ అంచనాల బరువుని మోసిందో లేదో ఇంకో మూడు రోజుల్లో తేలిపోతుంది.
This post was last modified on August 7, 2023 3:50 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…