సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మీద అంచనాలు మాములుగా ఎగబాకడం లేదు. కావాలయ్యా పాట, ట్రైలర్ వచ్చిన స్పందన హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఒక్క బెంగళూరు ప్రాంతంలోనే రిలీజ్ ఇంకా మూడు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3 కోట్లకు పైగా వసూలు కావడం కొత్త రికార్డుగా చెబుతున్నారు. ఇప్పటిదాకా షెడ్యూల్ చేసిన 903 షోలకు గాను 75 వేల టికెట్లు అమ్ముడుపోగా ఎల్లుండి ఉదయానికి ఈ నెంబర్లు రెట్టింపు అయినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని మల్టీప్లెక్సులు అత్యథికంగా ఒక రిక్లైనర్ కు 1400 రూపాయలు అమ్మినా ఆడియన్స్ లెక్క చేయడం లేదు.
దెబ్బకు భోళా శంకర్ తో పాటు గదర్ 2, ఓ మై గాడ్ 2 బుకింగ్స్ మరీ నెమ్మదిగా కదలడం అసలు ట్విస్టు. కన్నడనేలపై చిరంజీవికి ఎంత ఫాలోయింగ్ ఉన్నా వేదాళం రీమేక్ అనే పాయింట్ జనంలో ఎగ్జైట్ మెంట్ ని తగ్గించేసింది. జైలర్ ఖచ్చితంగా బాగుంటుందనే ప్రీ టాక్ సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. దాని ఫలితంగానే అమ్మకాలు బాగున్నాయని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. చెన్నైలో తెల్లవారుఝామున స్పెషల్ షోలు ఉంటాయో లేదో ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ బెంగళూరులో మాత్రం అయిదు గంటల షోలు అప్పుడే సోల్డ్ అవుట్ బోర్డులు పెడుతున్నాయి .
చాలా కాలంగా బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ కు జైలర్ సక్సెస్ చాలా కీలకం. పెద్దన్న, పేట, కాల, కబాలి లాంటివి ఒరిజినల్ వెర్షన్లు కమర్షియల్ గా ఎంత పే చేసినా బయట రాష్ట్రాల్లో మాత్రం డిజాస్టరయ్యాయి. అందుకే జైలర్ కనక హిట్టు కొడితే తిరిగి తన మార్కెట్ ని సాధించుకోవచ్చనే నమ్మకంతో ఉన్నారు. బీస్ట్ ఫ్లాప్ అయినా దర్శకుఢు నెల్సన్ దిలీప్ కుమార్ బ్రాండ్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. కొడుకుని కిడ్నాప్ చేసిన ఒక కరుడు గట్టిన ముఠాతో పోరాడే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా రజనీకాంత్ నటించిన జైలర్ అంచనాల బరువుని మోసిందో లేదో ఇంకో మూడు రోజుల్లో తేలిపోతుంది.
This post was last modified on August 7, 2023 3:50 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…