ఐదు నెలలకు పైగా ఇండియాలో థియేటర్లు మూత పడి ఉన్నాయి. విదేశాల్లో సైతం చాలా చోట్ల థియేటర్లకు మోక్షం లేకుండా చేసింది కరోనా. దీంతో కొత్త సినిమాల్ని ఎంతో కాలం ఆపి ఉంచలేక ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో నేరుగా రిలీజ్ చేసేస్తున్నారు.
బాలీవుడ్లో అయితే అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీల్లో నేరుగా రిలీజైపోతున్నాయి. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమే కొంచెం వెనుకబడి ఉంది. ఇక్కడ చిన్నా చితకా సినిమాలే ఓటీటీల్లోకి వచ్చాయి.
ఐతే భవిష్యత్ ఏమాత్రం ఆశాజనకంగా కనిపించకపోవడంతో ఎట్టకేలకు టాలీవుడ్ నిర్మాతల ఆలోచన మారింది. థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్న మీడియం రేంజ్ సినిమాల్ని కూడా ఓటీటీల్లో నేరుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ముందుగా అగ్ర నిర్మాత దిల్ రాజు ధైర్యం చేసి తన ‘వి’ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ వాళ్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. రూ.32 కోట్లకు ఈ డీల్ తెగిందంటున్నారు. సెప్టెంబరు తొలి వారంలో ఈ చిత్రం ప్రైంలోకి వస్తుందంటున్నారు. నాని-సుధీర్ బాబు కాంబినేషన్లో ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన చిత్రమిది. సినిమాకు మంచి క్రేజ్ ఉంది. టాక్ బాగుంటే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసేదేమో. ఆ తర్వాత డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్మితే ఇంకో 10 కోట్లకు తక్కువ కాకుండా ఆదాయం వచ్చేది. అందుకే ఓటీటీల్లో రిలీజ్ చేసి ఆదాయాన్ని దెబ్బ తీసుకోవడం ఎందుకని రాజు ఆగాడు. కానీ ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో సినిమాను ఓటీటీకి ఇచ్చేశాడు.
ఐతే ఇలా ఓటీటీల్లో వదిలేసినప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్ మీద రాజు ఆశలు వదులుకోవట్లేదట. ఆపై థియేటర్లు తెరుచుకున్నాక సినిమాను అక్కడా వదలబోతున్నారట. అలాగే కాస్త ముందు వెనుకగా విదేశాల్లోనూ రిలీజ్ చేస్తారట. ఐతే ఓటీటీల్లోకి వదిలేశాక థియేటర్లలోనూ ఆడేంత సత్తా ‘వి’కి ఉందా అన్నది సందేహం. కానీ ఎంత వస్తే అంత రానీ అని.. అలా కూడా సినిమాను రిలీజ్ చేయాలన్నది రాజు ప్లాన్. ఈ ప్రకారమే ప్రైమ్ వాళ్లతో డీల్ జరిగినట్లు తెలుస్తోంది.
This post was last modified on August 18, 2020 8:35 am
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…