హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ ఎందరో స్టార్ హీరోల ఫ్యాన్స్ కి ఐకానిక్ ప్లేస్. ఎన్నో బ్లాక్ బస్టర్లకు తిరుగులేని రికార్డులున్నాయి. దీని కెపాసిటీ 1216 సీట్లు. ఏపీ తెలంగాణలో ఇంత పెద్ద ప్రాంగణాలను వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలు. అలాంటి చోట ఇంకా ఆఫీస్ అవర్స్ కూడా మొదలుకాని టైంలో ఈ హాలు హౌస్ ఫుల్ అయ్యిందంటే ఏదో స్టార్ హీరో పెద్ద సినిమా కొత్త రిలీజ్ అయితే తప్ప సాధ్యం కాదు. అలాంటిది ఒక అనువాద చిత్రానికి అది కూడా 15 ఏళ్ళ క్రితం వచ్చిన పాత మూవీకి ఇలాంటి హాజరంటే ఆశ్చర్యమే.
ఇవాళ రీ రిలీజ్ జరుపుకున్న సూర్య సన్ అఫ్ కృష్ణన్ కి అభిమానులతో పాటు యూత్ పోటెత్తుతున్నారు. సూర్యని ఎందుకు తెలుగువాళ్ళ దత్తపుత్రుడని ప్రేమతో అంటారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాలో సూర్య తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అప్పట్లో ఇది గజిని రేంజ్ విజయం సాధించలేదు. తర్వాత కల్ట్ స్టేటస్ వచ్చింది. కానీ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ పాటలు ఊపేసాయి. ఆ సమయంలో దీని విలువని గుర్తించని యువత మధ్య వయసుకు వచ్చాక అరెరే అపార్థం చేసుకున్నామే అనుకున్నారు. కానీ కొత్త జనరేషన్ కి ఇది ఫెవరెట్.
ఇక్కడొకటే కాదు వైజాగ్ లాంటి ఇతర ప్రాంతాల్లోనూ ఇంచు మించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆరంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి రెస్పాన్స్ దీనికే చూస్తున్నామని ఎగ్జిబిటర్ల టాక్. రేపటి నుంచి అదనంగా మరో 50 స్క్రీన్లు పెంచబోతున్నారు. విచిత్రంగా ఇవాళ తొమ్మిది తెలుగు సినిమాలు రిలీజ్ అయితే వాటిలో దేనికీ కనీస స్పందన లేదు. కొన్ని ఏకంగా మార్నింగ్ షోలే క్యాన్సిల్ చేసుకునేంత దారుణంగా బజ్ తెచ్చుకున్నాయి. కానీ సూర్య సన్ అఫ్ కృష్ణన్ మాత్రం దీనికి భిన్నంగా కాసిన్ని రికార్డులు నెలకొల్పేలా ఉంది. దెబ్బకు తమిళ వెర్షన్ కూడా రీరిలీజ్ చేయమనే డిమాండ్ మొదలవ్వడం విశేషం. తెలుగువాళ్ళ సినిమా పిచ్చి కాదు ప్రేమ ఇలాగే ఉంటుంది.
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…