ఈ నెల 11న విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 మీద పెద్ద చర్చే నడుస్తోంది. కంటెంట్ పట్ల సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన తరుణంలో వాటికి ఎక్కువ కోత వేయడం ఇష్టం లేని నిర్మాతలు ఫైనల్ గా అడల్ట్స్ ఓన్లీ A సర్టిఫికెట్ వైపే మొగ్గు చూపడం ట్రేడ్ ని షాక్ కి గురి చేస్తోంది. ఎందుకంటే సింగల్ స్క్రీన్స్ లో ఏమో కానీ మల్టీప్లెక్సులు ఈ నిబంధనని కఠినంగా పాటిస్తాయి. టికెట్ కొన్నా సరే 18 వయసు లోపు టీనేజర్స్, పిల్లలని నెత్తి నోరు బాదుకున్నా అనుమతించవు. అది తెలిసి దూరమయ్యే కుటుంబ ప్రేక్షకులు లక్షల్లో ఉంటారనేది వాస్తవం.
మొత్తం 2 గంటల 36 నిమిషాల నిడివి ఉన్న ఓ మై గాడ్ కు మొత్తం 27 కట్లు, మ్యూట్లు, ఎడిటింగ్లు రికమండ్ చేయగా వాటికి దర్శక నిర్మాతలు ఒప్పుకున్నారు. వాటిలో కొన్ని బూతులు, పాత్రలు చేసిన ఎక్స్ పోజింగ్ బిట్లు, అభ్యంతరకరం అనిపించే మాటలు ఉన్నాయి. కొన్ని కత్తెర వేయగా కొన్ని సంభాషణలు డబ్బింగ్ లో మార్చేశారు. నిజానికి ఈ అబ్జెక్షన్ల వల్లే రిలీజ్ వాయిదా వేయాలనే ఆలోచన కూడా ఒక దశలో జరిగింది కానీ మంచి హాలిడే ప్లస్ లాంగ్ వీకెండ్ ని వదులుకోవడం ఇష్టం లేని ఓ మై గాడ్ బృందం ఆఘమేఘాల మీద ఈ ఒత్తిడినంతా దాటుకుని పూర్తి చేసుకుంది.
అదే రోజు వస్తున్న సన్నీ డియోల్ గదర్ 2 నుంచి అక్షయ్ టీమ్ కి పెద్ద పోటీ స్వాగతం పలుకుతోంది. ప్రస్తుతానికి రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానికి టాక్ తో సంబంధం మంచి కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో వెరైటీ అండ్ మాస్ కథలతో రూపొందిన ఓ మై గాడ్ 2, గదర్ 2 లకు అంతకన్నా ఆదరణ దక్కుతుందని బయ్యర్లు ఆశలు పెట్టుకున్నారు. రజనీకాంత్ జైలర్ కూడా హిందీ డబ్బింగ్ తో వస్తున్నప్పటికీ నార్త్ జనాలు దేనికి ఓటేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అసలే అక్షయ్ మార్కెట్ డౌన్ లో ఉండగా, సన్నీ డియోల్ మెయిన్ స్ట్రీమ్ లో లేరు. సక్సెస్ కొట్టడం ఇద్దరికీ చాలా కీలకమే కాదు అవసరం కూడా.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…