కొన్నేళ్ల క్రితం వచ్చిన ఫ్లాపులు, డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ పుణ్యమాని మంచి డబ్బులు చేసుకుంటున్నాయి. ఆ మధ్య ధనుష్ 3ని ఇలాగే విడుదల చేస్తే యూత్ ఎగబడి చూశారు. వారం దాకా ఆడిస్తే హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాల వర్షం కురిసింది. నాగబాబుని నష్టాలపాలు చేసిన ఆరంజ్ ని వదిలితే జనసేనకు ఏకంగా కోటి రూపాయలు విరాళం ఇచ్చే రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది. రెబెల్ కూడా కొన్ని చోట్ల మంచి ఫిగర్లు నమోదు చేసింది. ఇప్పుడు సూర్య సన్ అఫ్ కృష్ణన్ వస్తోంది. ఆగస్ట్ 4న తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు.
విచిత్రమేంటంటే 2008లో ఇది ఒరిజినల్ గా వచ్చినప్పుడు కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది. గజిని లాంటి యాక్షన్ థ్రిల్లర్స్ లో చూసిన సూర్యని వివిధ వయసుల్లో దర్శకుడు గౌతమ్ మీనన్ స్లో టేకింగ్ లో చూడటం తెలుగు ప్రేక్షకులు భారంగా ఫీలయ్యారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. టీవీ, డివిడి, యూట్యూబ్, ఓటిటిలో వచ్చాక క్రమంగా కల్ట్ స్టేటస్ రావడం మొదలయ్యింది. అప్పట్లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని మిస్ చేసిన వాళ్ళు ఇప్పుడు చూసేందుకు రెడీ అవుతున్నారు. అందుకే ఉదయం 8 గంటల షోలు పెడుతున్నా ఫుల్ అవుతున్నాయి.
హైదరాబాద్, వైజాగ్ తదితర నగరాల్లో బుకింగ్స్ ఊపందుకున్నాయి. నిజానికి గత నెల సూర్య పుట్టినరోజుకు ప్లాన్ చేసినప్పటికీ కొత్త సినిమాలు విపరీతంగా ఉండటంతో స్క్రీన్ల కొరత వల్ల వెనక్కు తగ్గారు. ఇప్పుడా సమస్య లేదు. బ్రో నెమ్మదించింది. బేబీ ఊపు తగ్గింది. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. సో సహజంగానే సూర్య సన్ అఫ్ కృష్ణన్ వైపు యూత్ మొగ్గు చూపుతున్నారు. వచ్చే వారం 9న మహేష్ బాబు బిజినెస్ మెన్ రాబోతున్న నేపథ్యంలో ఆగస్ట్ నెల తొలి పది రోజులు వీళ్లిద్దరే వాడుకునేలా ఉన్నారు. పదిహేనేళ్ల తర్వాత ఫ్లాప్ మూవీకి ఈ స్థాయి రెస్పాన్స్ విశేషమే.
This post was last modified on August 1, 2023 1:57 pm
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…