ఇవాళ బ్రో విడుదలైపోయింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో తెల్లవారుఝామున 4 నుంచి 6 గంటల లోపు బెనిఫిట్ షో పడకపోవడం ఒక్క దీని విషయంలోనే జరిగిందని ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. యుఎస్ ప్రీమియర్లు అనుకున్న టైంకి స్టార్ట్ అయ్యాయి. రిపోర్ట్స్ కూడా మొదలయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉదయం 7 కన్నా ముందు ఎక్కడ షో వేయకపోవడం చూసి అభిమానుల ఫీలింగ్ మాములుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నప్పటికీ సూర్యుడు రాకముందే థియేటర్ల దగ్గరకు వెళ్లి సందడి చేస్తే ఆ కిక్కే వేరు. అది మిస్ అవ్వడం వాళ్ళను బాధించింది.
ఎప్పుడో 1996లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో మొదలుపెట్టి భీమ్లా నాయక్ దాకా ఏపీ తెలంగాణలో పవన్ సినిమాలు దాదాపు అన్ని చోట్ల స్పెషల్ షోలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం దాన్ని బ్రేక్ చేశారు. దీని వెనుక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలివైన ఎత్తుగడ ఒకటుంది. ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పర్మిషన్లు అడగటం పెద్ద ప్రహసనం. ఎందుకొచ్చిన తలనొప్పని వద్దనుకున్నారు. నైజామ్ లో కెసిఆర్ సర్కారుతో ఎలాంటి సమస్య లేకపోయినా ఒకేసారి ప్రదర్శనలు జరగాలన్న ఉద్దేశంతో కనీసం ఎక్స్ ట్రా షో కోసమైనా అనుమతి కొరకపోవడం ట్విస్టు.
దీని వల్ల ఓపెనింగ్స్ ఫిగర్స్ మీద ప్రభావమైతే ఉంటుంది. ఎందుకంటే కొన్ని వందల వేల షోలు ఎర్లీ మార్నింగ్ వేయకపోవడం వల్ల కోట్లలో గ్రాస్ మిస్ అవుతుంది. మొదటి రోజు రికార్డుల మీద డిబేట్లు చేసుకునే ఫ్యాన్స్ కి ఇది ఇబ్బంది కలిగిస్తుంది. అఫ్కోర్స్ కంటెంట్ బాగుంటే తర్వాతైనా పవన్ మొత్తం లాగేస్తాడు కానీ ఎంతైనా ఫస్ట్ డే నమోదయ్యే ఫిగర్లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. స్క్రీన్ కౌంట్ పరంగానూ బ్రోకు రావాల్సిన పెద్ద నెంబర్ చుట్టూ ఉన్న కొత్త పాత సినిమాల వల్ల దక్కలేదు. ఇన్ని ప్రతికూలతలు దాటుకుని వచ్చిన బ్రో ఎలా ఉన్నాడో ఇంకో రెండు మూడు గంటల్లో తేలిపోతుంది
This post was last modified on July 28, 2023 12:23 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…