నటనకు ఛాలెంజ్ ఇచ్చే పాత్రలనే ఎక్కువగా ఎంచుకునే ధనుష్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం బాగా తగ్గించేశాడు. అందుకే తన డబ్బింగులు చాలా మటుకు రావడం లేదు. కర్ణన్ ఎంత గొప్పగా ఆడినా మన ఆడియన్స్ కి సూట్ అవ్వదనే ఉద్దేశంతో అటు అనువాదం జరగలేదు ఇటు రీమేక్ కాలేదు. అంతటి క్రియేటివ్ సబ్జెక్ట్ సెలక్షన్ తో దూసుకెళుతున్న ధనుష్ కొత్త సినిమా కెప్టెన్ మిల్లర్ వచ్చే డిసెంబర్ 15 విడుదలకు రెడీ అవుతోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు టీజర్ వదిలారు. కాన్సెప్ట్ చూస్తే షాక్ ఇచ్చేలా ఉంది.
స్వతంత్రం రాకముందు దేశం బ్రిటిష్ పాలన ఉన్న నాటి రోజుల్లో అడవికి దగ్గర్లో ఉండే ఒక మారుమూల గిరిజన తండా లాంటి ఊరు. హఠాత్తుగా వచ్చి మీద పడుతుంది ఇంగ్లీష్ సైన్యం. దానికి ఎదురొడ్డి నిలబడతాడు మిల్లర్(ధనుష్). ఒక విప్లవకారుడి మాదిరి వాళ్ళతో తలపడి విధ్వంసం సృష్టిస్తాడు. అయితే తెల్లదొరలు దాడికి తెగబడేందుకు కారణం ఏంటి, ఇంతకీ మిల్లర్ అంటే నిజంగా మనం అనుకుంటున్న వ్యక్తా లేక మరొకరు ఉన్నారా అనేది సస్పెన్స్. విజువల్స్ మొత్తం రా అండ్ రస్టిక్ గా ఉన్నాయి. భారీగా యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు.
తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, సిద్దార్థ నుని ఛాయాగ్రహణం హై స్టాండర్డ్ లో సాగాయి. స్టోరీని ఎక్కువ రివీల్ చేసే అవకాశం ఇవ్వకుండా తెలివిగా కట్ చేయించారు దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్. ఇప్పటిదాకా గ్లామర్ డాల్ గానే కనిపిస్తూ వచ్చిన ప్రియాంకా మోహన్ కి తుపాకీ ఇచ్చి పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే క్యారెక్టర్ ఇచ్చారు. మొత్తానికి ఇంటెన్సిటీతో నిండిన కెప్టెన్ మిల్లర్ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలానే కనిపిస్తోంది. క్రిస్మస్ కు గట్టి పోటీ ఉండటంతో తెలివిగా పది రోజుల ముందే మిల్లర్ థియేటర్లకు వస్తున్నాడు
This post was last modified on July 28, 2023 11:19 am
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…