టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొన్నేళ్ల కిందటే తన కొడుకు సంజయ్ రావును హీరోగా పరిచయం చేశాడు. అతడి అరంగేట్ర చిత్రం ‘పిట్టకథ’ అనుకున్నంత ప్రభావం చూపలేకపోయింది. ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. సంజయ్ రావు ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోయాడు. తర్వాత అతను బాగా గ్యాప్ తీసుకుని ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అనే సినిమా చేశాడు. ప్రణవి మానుకొండ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి ఇలా చాలామంది పేరున్న తారాగణం ఉన్నారు.
ఏఆర్ శ్రీధర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ టైటిల్ చూస్తేనే ఇదొక కామెడీ మూవీ అనే విషయం అర్థమవుతుంది. ఈ సినిమా ప్రోమోలు ఆకట్టుకునేలాగే ఉన్నాయి. కానీ రాంగ్ టైమింగ్లో రిలీజ్ చేయడమే ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’కు పెద్ద ప్రతికూలతగా మారింది. ఈ నెల 21నే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ అప్పుడు పోటీ ఉందని వారం వాయిదా వేశారు.
ఈ వారం ‘బ్రో’ లాంటి భారీ చిత్రం పోటీలో ఉండగా.. తర్వాతి రోజు ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ను రిలీజ్ చేస్తున్నారు. రెండు వారాల ముందు వచ్చిన ‘బేబి’ ఇంకా బాగా ఆడుతోంది. ఇంగ్లిష్ సినిమాలు మిషన్ ఇంపాజిబుల్, ఓపెన్ హైమర్, బార్బీలకు మల్టీప్లెక్సుల్లో పెద్ద ఎత్తున షోలు కొనసాగుతున్నాయి. ఈ వారం ‘బ్రో’కు తోడు ‘రాకి ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ రిలీజవుతోంది. ఇంత పోటీ మధ్య ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’కు పెద్దగా స్క్రీన్లు, షోలే దక్కలేదు.
ఇన్ని సినిమాల మధ్య ఈ చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారన్నది కూడా సందేహమే. దీని కంటే గత వారం వచ్చినా బాగుండేది. వచ్చే వారం రావాల్సిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వాయిదా పడింది కాబట్టి.. సినిమాను ఆ రోజుకు రీషెడ్యూల్ చేసుకోవాల్సింది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ సినిమా బాగున్నా కూడా ఆడుతుందా అన్నది డౌటే. కొడుకు సినిమాను ప్రమోట్ చేయడానికి చాలా కష్టపడుతున్న బ్రహ్మాజీ రిలీజ్ ప్లానింగ్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సింది.
This post was last modified on July 28, 2023 11:11 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…