టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొన్నేళ్ల కిందటే తన కొడుకు సంజయ్ రావును హీరోగా పరిచయం చేశాడు. అతడి అరంగేట్ర చిత్రం ‘పిట్టకథ’ అనుకున్నంత ప్రభావం చూపలేకపోయింది. ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. సంజయ్ రావు ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోయాడు. తర్వాత అతను బాగా గ్యాప్ తీసుకుని ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అనే సినిమా చేశాడు. ప్రణవి మానుకొండ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి ఇలా చాలామంది పేరున్న తారాగణం ఉన్నారు.
ఏఆర్ శ్రీధర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ టైటిల్ చూస్తేనే ఇదొక కామెడీ మూవీ అనే విషయం అర్థమవుతుంది. ఈ సినిమా ప్రోమోలు ఆకట్టుకునేలాగే ఉన్నాయి. కానీ రాంగ్ టైమింగ్లో రిలీజ్ చేయడమే ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’కు పెద్ద ప్రతికూలతగా మారింది. ఈ నెల 21నే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ అప్పుడు పోటీ ఉందని వారం వాయిదా వేశారు.
ఈ వారం ‘బ్రో’ లాంటి భారీ చిత్రం పోటీలో ఉండగా.. తర్వాతి రోజు ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ను రిలీజ్ చేస్తున్నారు. రెండు వారాల ముందు వచ్చిన ‘బేబి’ ఇంకా బాగా ఆడుతోంది. ఇంగ్లిష్ సినిమాలు మిషన్ ఇంపాజిబుల్, ఓపెన్ హైమర్, బార్బీలకు మల్టీప్లెక్సుల్లో పెద్ద ఎత్తున షోలు కొనసాగుతున్నాయి. ఈ వారం ‘బ్రో’కు తోడు ‘రాకి ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ రిలీజవుతోంది. ఇంత పోటీ మధ్య ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’కు పెద్దగా స్క్రీన్లు, షోలే దక్కలేదు.
ఇన్ని సినిమాల మధ్య ఈ చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారన్నది కూడా సందేహమే. దీని కంటే గత వారం వచ్చినా బాగుండేది. వచ్చే వారం రావాల్సిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వాయిదా పడింది కాబట్టి.. సినిమాను ఆ రోజుకు రీషెడ్యూల్ చేసుకోవాల్సింది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ సినిమా బాగున్నా కూడా ఆడుతుందా అన్నది డౌటే. కొడుకు సినిమాను ప్రమోట్ చేయడానికి చాలా కష్టపడుతున్న బ్రహ్మాజీ రిలీజ్ ప్లానింగ్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సింది.
This post was last modified on July 28, 2023 11:11 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…