మావయ్య తో కలిసి బ్రో సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్న మెగా హీరో సాయి తేజ్ , నెక్స్ట్ సంపత్ నంది డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ‘గాంజా శంకర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ నుండి ప్రేరణ పొంది ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్టు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే టీం నుండి ఈ టైటిల్ ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా తేజ్ ఈ టైటిల్ ను ఆఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు.
‘బ్రో’ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్న తేజ్ అందులో భాగంగా నెక్స్ట్ సంపత్ నంది తో గాంజా శంకర్ సినిమా చేస్తున్నానని తెలిపాడు. ఆరోగ్య పరంగా ఆరు నెలలు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని చెప్పుకున్నాడు. ఆరు నెలలు పూర్తిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకొనున్నట్లు చెప్పాడు. కొన్ని నెలల క్రితమే సంపత్ నంది తో ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు తేజ్.
సితార ఎంటర్టైన్ మెంట్స్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. సాయి తేజ్ కి హీరోయిన్ గా పూజ హెగ్డే , లేదా శ్రీలీలను అనుకుంటున్నారు, ఈ ఇద్దరి డేట్స్ కూదరకపోతే మరో హీరోయిన్ కి ఛాన్స్ దక్కనుంది. కొన్నేళ్ళుగా హిట్ కోసం పరితపిస్తున్న సంపత్ నంది ఈ సినిమాతో దర్శకుడిగా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.
This post was last modified on July 27, 2023 1:20 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…