మావయ్య తో కలిసి బ్రో సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్న మెగా హీరో సాయి తేజ్ , నెక్స్ట్ సంపత్ నంది డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ‘గాంజా శంకర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ నుండి ప్రేరణ పొంది ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్టు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే టీం నుండి ఈ టైటిల్ ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా తేజ్ ఈ టైటిల్ ను ఆఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు.
‘బ్రో’ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్న తేజ్ అందులో భాగంగా నెక్స్ట్ సంపత్ నంది తో గాంజా శంకర్ సినిమా చేస్తున్నానని తెలిపాడు. ఆరోగ్య పరంగా ఆరు నెలలు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని చెప్పుకున్నాడు. ఆరు నెలలు పూర్తిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకొనున్నట్లు చెప్పాడు. కొన్ని నెలల క్రితమే సంపత్ నంది తో ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు తేజ్.
సితార ఎంటర్టైన్ మెంట్స్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. సాయి తేజ్ కి హీరోయిన్ గా పూజ హెగ్డే , లేదా శ్రీలీలను అనుకుంటున్నారు, ఈ ఇద్దరి డేట్స్ కూదరకపోతే మరో హీరోయిన్ కి ఛాన్స్ దక్కనుంది. కొన్నేళ్ళుగా హిట్ కోసం పరితపిస్తున్న సంపత్ నంది ఈ సినిమాతో దర్శకుడిగా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.
This post was last modified on July 27, 2023 1:20 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…