నిన్న జరిగిన పేక మేడలు టీజర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ అన్న మాటలు కొత్త చర్చకు దారి తీశాయి. బేబీ ఆఫర్ మొదట తనకే వచ్చిందని, అయితే దర్శకుడి పేరు చెప్పగానే కనీసం కథ వినకుండా నో చెప్పాడని రకరకాల ప్రచారం జరిగింది. అయితే సాయిరాజేష్ తన ప్రస్తావన నేరుగా ఎక్కడా తేకపోయినా ఇది ఎవరి గురించోనని అర్థం చేసుకున్న నెటిజెన్లు, సోషల్ మీడియా వర్గం దాన్ని విశ్వక్ కు ఆపాదించేశాయి. అయితే అది నిజమేననే క్లారిటీ క్రమంగా వచ్చింది. సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ సైతం ఇన్ డైరెక్ట్ గా ఈ ఉదంతాన్ని కోట్ చేయడంతో ఇంకాస్త వైరల్ అయ్యింది.
తాజాగా విశ్వక్ చేసిన కామెంట్స్ అన్నింటికీ సమాధానం ఇచ్చాయి. బేబీ, సాయిరాజేష్ ల ప్రస్తావన తేకుండా ఏదైనా సినిమా ఒప్పుకోవడం నో చెప్పడం తన స్వేచ్ఛని, అంతమాత్రాన బురద జల్లాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఒక చిన్న చిత్రం పెద్ద విజయం సాధించినప్పుడు సంతోషపడే వాళ్ళలో తాను ముందుంటానని, డైరెక్టర్ల వాట్స్ అప్ గ్రూప్ లో మొదట శుభాకాంక్షలు చెప్పింది తనేన ని మరో వివరణ ఇచ్చాడు. దీన్ని బట్టే ఈ వ్యవహారం ఇతన్ని బాగా హర్ట్ చేసిందని అర్థమవుతోంది. నిజంగానే బేబీలో ఆనంద్ పాత్రకు విశ్వక్ అంతగా సూటయ్యేవాడు కాదనేది వాస్తవం.
ఆ మధ్య సీనియర్ హీరో అర్జున్ ప్రాజెక్టు నుంచి బయటికి రావడం మీడియా సాక్షిగా విశ్వక్ సేన్ కి కొంత ఇబ్బంది తెచ్చి పెట్టింది. ప్రారంభంలోనే ఆగిపోయింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఇష్యూ చాలా సీరియస్ అయ్యేది. సరే దాన్ని జనాలు త్వరగా మర్చిపోయినా బేబీ వల్ల మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. ప్రస్తుతం రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్స్ చేస్తున్న విశ్వక్ సేన్ కి ఆ మధ్య దాస్ కా ధమ్కీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దానికి తోడు అవసరం లేని వివాదాలు ఇలా చుట్టుముడుతూ ఉంటే ఎక్కడో ఒక చోట బరస్ట్ కావడం తప్ప చేయగలిగింది ఏముంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…