నిన్న జరిగిన పేక మేడలు టీజర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ అన్న మాటలు కొత్త చర్చకు దారి తీశాయి. బేబీ ఆఫర్ మొదట తనకే వచ్చిందని, అయితే దర్శకుడి పేరు చెప్పగానే కనీసం కథ వినకుండా నో చెప్పాడని రకరకాల ప్రచారం జరిగింది. అయితే సాయిరాజేష్ తన ప్రస్తావన నేరుగా ఎక్కడా తేకపోయినా ఇది ఎవరి గురించోనని అర్థం చేసుకున్న నెటిజెన్లు, సోషల్ మీడియా వర్గం దాన్ని విశ్వక్ కు ఆపాదించేశాయి. అయితే అది నిజమేననే క్లారిటీ క్రమంగా వచ్చింది. సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ సైతం ఇన్ డైరెక్ట్ గా ఈ ఉదంతాన్ని కోట్ చేయడంతో ఇంకాస్త వైరల్ అయ్యింది.
తాజాగా విశ్వక్ చేసిన కామెంట్స్ అన్నింటికీ సమాధానం ఇచ్చాయి. బేబీ, సాయిరాజేష్ ల ప్రస్తావన తేకుండా ఏదైనా సినిమా ఒప్పుకోవడం నో చెప్పడం తన స్వేచ్ఛని, అంతమాత్రాన బురద జల్లాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఒక చిన్న చిత్రం పెద్ద విజయం సాధించినప్పుడు సంతోషపడే వాళ్ళలో తాను ముందుంటానని, డైరెక్టర్ల వాట్స్ అప్ గ్రూప్ లో మొదట శుభాకాంక్షలు చెప్పింది తనేన ని మరో వివరణ ఇచ్చాడు. దీన్ని బట్టే ఈ వ్యవహారం ఇతన్ని బాగా హర్ట్ చేసిందని అర్థమవుతోంది. నిజంగానే బేబీలో ఆనంద్ పాత్రకు విశ్వక్ అంతగా సూటయ్యేవాడు కాదనేది వాస్తవం.
ఆ మధ్య సీనియర్ హీరో అర్జున్ ప్రాజెక్టు నుంచి బయటికి రావడం మీడియా సాక్షిగా విశ్వక్ సేన్ కి కొంత ఇబ్బంది తెచ్చి పెట్టింది. ప్రారంభంలోనే ఆగిపోయింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఇష్యూ చాలా సీరియస్ అయ్యేది. సరే దాన్ని జనాలు త్వరగా మర్చిపోయినా బేబీ వల్ల మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. ప్రస్తుతం రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్స్ చేస్తున్న విశ్వక్ సేన్ కి ఆ మధ్య దాస్ కా ధమ్కీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దానికి తోడు అవసరం లేని వివాదాలు ఇలా చుట్టుముడుతూ ఉంటే ఎక్కడో ఒక చోట బరస్ట్ కావడం తప్ప చేయగలిగింది ఏముంది.
This post was last modified on July 27, 2023 12:58 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…