ఈ ఏడాది ఆరంభంలో ‘పఠాన్’తో భారీ విజయం అందుకున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. దీని తర్వాత ఆయన చేస్తున్న కొత్త చిత్రం ‘జవాన్’కు బంపర్ క్రేజ్ వచ్చింది. తమిళంలో రాజా రాణి, తెరి, మెర్శల్, బిగిల్.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్లు తీసిన అట్లీ ఈ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. ఒక సౌత్ డైరెక్టర్.. షారుఖ్ను ఎలా డీల్ చేస్తాడో అని చాలామంది సందేహించారు కానీ.. ట్రైలర్ చూశాక ఆ సందేహాలన్నీ ఎగిరిపోయాయి.
‘పఠాన్’కు ఏమాత్రం తగ్గని యాక్షన్ అడ్వెంచర్ లాగా కనిపించింది ట్రైలర్ చూస్తే. సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఐతే సినిమాలో మరెన్నో సర్ప్రైజ్లు ఉంటాయని.. షారుఖ్ ఫ్యాన్స్ అనే కాక అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ‘జవాన్’ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో తమిళ టాప్ స్టార్ విజయ్ క్యామియో చేసినట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఐతే ఇప్పుడా విషయం నిజమే అని తేలింది. ‘జవాన్’లో విజయ్ కొన్ని నిమిషాల పాటు తళుక్కుమనబోతున్నట్లు న్యూస్ అధికారికంగానే బయటికి వచ్చింది. మరి విజయ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడన్నది ఆసక్తికరం. విజయ్ ఈ సినిమాలో కనిపించేట్లయితే.. తమిళంలో ‘జవాన్’కు బాగా ప్లస్ కావడం ఖాయం.
ఇప్పటికే ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించడం.. విజయ్ సేతుపతి విలన్గా కనిపించడం.. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చడం వల్ల ‘జవాన్’ తమిళులతో పాటు సౌత్ జనాలకు కనెక్ట్ అవుతోంది. విజయ్ కూడా దక్షిణాదిన ఇంకా క్రేజ్ వస్తుంది. షారుఖ్ ఉన్నాడు కాబట్టి నార్త్ అంతా సినిమా దున్నేయడం ఖాయం. షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుఖ్ ఇందులో దేశం కోసం పాటుపడే సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు.
This post was last modified on July 25, 2023 8:44 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…