ఈ ఏడాది ఆరంభంలో ‘పఠాన్’తో భారీ విజయం అందుకున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. దీని తర్వాత ఆయన చేస్తున్న కొత్త చిత్రం ‘జవాన్’కు బంపర్ క్రేజ్ వచ్చింది. తమిళంలో రాజా రాణి, తెరి, మెర్శల్, బిగిల్.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్లు తీసిన అట్లీ ఈ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. ఒక సౌత్ డైరెక్టర్.. షారుఖ్ను ఎలా డీల్ చేస్తాడో అని చాలామంది సందేహించారు కానీ.. ట్రైలర్ చూశాక ఆ సందేహాలన్నీ ఎగిరిపోయాయి.
‘పఠాన్’కు ఏమాత్రం తగ్గని యాక్షన్ అడ్వెంచర్ లాగా కనిపించింది ట్రైలర్ చూస్తే. సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఐతే సినిమాలో మరెన్నో సర్ప్రైజ్లు ఉంటాయని.. షారుఖ్ ఫ్యాన్స్ అనే కాక అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ‘జవాన్’ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో తమిళ టాప్ స్టార్ విజయ్ క్యామియో చేసినట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఐతే ఇప్పుడా విషయం నిజమే అని తేలింది. ‘జవాన్’లో విజయ్ కొన్ని నిమిషాల పాటు తళుక్కుమనబోతున్నట్లు న్యూస్ అధికారికంగానే బయటికి వచ్చింది. మరి విజయ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడన్నది ఆసక్తికరం. విజయ్ ఈ సినిమాలో కనిపించేట్లయితే.. తమిళంలో ‘జవాన్’కు బాగా ప్లస్ కావడం ఖాయం.
ఇప్పటికే ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించడం.. విజయ్ సేతుపతి విలన్గా కనిపించడం.. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చడం వల్ల ‘జవాన్’ తమిళులతో పాటు సౌత్ జనాలకు కనెక్ట్ అవుతోంది. విజయ్ కూడా దక్షిణాదిన ఇంకా క్రేజ్ వస్తుంది. షారుఖ్ ఉన్నాడు కాబట్టి నార్త్ అంతా సినిమా దున్నేయడం ఖాయం. షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుఖ్ ఇందులో దేశం కోసం పాటుపడే సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు.
This post was last modified on July 25, 2023 8:44 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…