ఈ ఏడాది ఆరంభంలో ‘పఠాన్’తో భారీ విజయం అందుకున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. దీని తర్వాత ఆయన చేస్తున్న కొత్త చిత్రం ‘జవాన్’కు బంపర్ క్రేజ్ వచ్చింది. తమిళంలో రాజా రాణి, తెరి, మెర్శల్, బిగిల్.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్లు తీసిన అట్లీ ఈ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. ఒక సౌత్ డైరెక్టర్.. షారుఖ్ను ఎలా డీల్ చేస్తాడో అని చాలామంది సందేహించారు కానీ.. ట్రైలర్ చూశాక ఆ సందేహాలన్నీ ఎగిరిపోయాయి.
‘పఠాన్’కు ఏమాత్రం తగ్గని యాక్షన్ అడ్వెంచర్ లాగా కనిపించింది ట్రైలర్ చూస్తే. సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఐతే సినిమాలో మరెన్నో సర్ప్రైజ్లు ఉంటాయని.. షారుఖ్ ఫ్యాన్స్ అనే కాక అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ‘జవాన్’ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో తమిళ టాప్ స్టార్ విజయ్ క్యామియో చేసినట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఐతే ఇప్పుడా విషయం నిజమే అని తేలింది. ‘జవాన్’లో విజయ్ కొన్ని నిమిషాల పాటు తళుక్కుమనబోతున్నట్లు న్యూస్ అధికారికంగానే బయటికి వచ్చింది. మరి విజయ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడన్నది ఆసక్తికరం. విజయ్ ఈ సినిమాలో కనిపించేట్లయితే.. తమిళంలో ‘జవాన్’కు బాగా ప్లస్ కావడం ఖాయం.
ఇప్పటికే ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించడం.. విజయ్ సేతుపతి విలన్గా కనిపించడం.. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చడం వల్ల ‘జవాన్’ తమిళులతో పాటు సౌత్ జనాలకు కనెక్ట్ అవుతోంది. విజయ్ కూడా దక్షిణాదిన ఇంకా క్రేజ్ వస్తుంది. షారుఖ్ ఉన్నాడు కాబట్టి నార్త్ అంతా సినిమా దున్నేయడం ఖాయం. షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుఖ్ ఇందులో దేశం కోసం పాటుపడే సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు.
This post was last modified on July 25, 2023 8:44 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…