ఒకప్పుడు టాలీవుడ్లో చాలా బిజీగా ఉన్న యువ కథానాయకుల్లో నారా రోహిత్ ఒకడు. ఒక సమయంలో అతను నటించిన తొమ్మిది సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఏడాదికి మూడు చొప్పున సినిమాలు రిలీజ్ చేసేవాడు రోహిత్. కమర్షియల్ సక్సెస్ అయ్యాయా లేదా అన్నది పక్కన పెడితే.. రోహిత్ సినిమాలంటే వైవిధ్యంగా ఉంటాయి అనే పేరు అయితే వచ్చింది. రౌడీ ఫెలో సహా కొన్ని సినిమాలు తనకు మంచి గుర్తింపు తెచ్చాయి.
కానీ ఎలాంటి హీరోకైనా వరుసగా ఫ్లాపులు వస్తే తట్టుకోవడం కష్టమే. రోహిత్ కూడా అలాగే ఇబ్బంది పడ్డాడు. అనూహ్యంగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాడు. నాలుగేళ్ల నుంచి ఏ సినిమా చేయట్లేదు. అందరూ అతణ్ని మరిచిపోతున్న సమయంలో ఇప్పుడు ‘ప్రతినిధి-2’తో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. టీవీ5 న్యూస్ ప్రెజెంటర్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం పెద్ద సర్ప్రైజ్.
ఐతే నారా రోహిత్ రీఎంట్రీకి ఇది సరైన సినిమానేనా అన్నది ఇప్పుడు ప్రశ్న. తన కెరీర్ ఆల్రెడీ దెబ్బ తింది. జనాలు దాదాపుగా అతణ్ని మరిచిపోయారు. ఇలాంటి సమయంలో కమర్షియల్గా వర్కవుట్ అయ్యే.. లేదంటే తన మార్కు వైవిధ్యమైన థ్రిల్లర్ టచ్ ఉన్న సినిమా చేస్తే బాగుండేదేమో. కానీ అతను మాత్రం పొలిటికల్ టచ్ ఉన్న ప్రాపగండా తరహా సినిమా చేస్తున్నట్లు కనిపిస్తోంది. నారా రోహిత్ గతంలో చేసిన కొన్ని సినిమాల్లోనూ పొలిటికల్ టచ్ ఉంది. ‘ప్రతినిధి’ ఆ కోవకు చెందిన చిత్రమే.
ఇప్పుడు టీడీపీకి బలమైన మద్దతుదారుగా పేరున్న మూర్తి దర్శకత్వంలో సినిమా చేస్తూ.. 2024 ఎన్నికల ముంగిట రిలీజ్ చేయాలనుకుంటున్నారంటే ఇది కచ్చితంగా పొలిటికల్ ప్రాపగండా ఫిలిం అనే ముద్ర పడిపోతుంది. సినిమా రంగంలో ఏ అనుభవం లేని మూర్తి.. ఇలా నేరుగా డైరెక్షన్ చేసేస్తుండటం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఒక జర్నలిస్ట్ కోణంలో రాజకీయ సినిమా మాత్రమే తీయగలరేమో అనిపిస్తోంది. ఇవన్నీ చూస్తే కెరీర్ స్ట్రగుల్లో ఉన్న టైంలో రోహిత్కు ఇది సరైన రీఎంట్రీయేనా అన్న సందేహాలైతే కలుగుతున్నాయి. మరి ‘ప్రతినిధి-2’తో ఈ అభిప్రాయాలను అతను మారుస్తాడేమో చూడాలి.
This post was last modified on July 25, 2023 5:13 pm
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…