బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వరుణ దేవుడు పెద్ద పరీక్షే పెడుతున్నాడు. సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం అనూహ్యంగా వాయిదా పడుతూ 6 నుంచి రాత్రి 8.30 గంటలకు షిఫ్ట్ అయిపోయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం, భారీ వర్షం పడే సూచనలు ఉండటంతో పోలీసుల సూచనల మేరకు ఆలస్యంగా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. హైటెక్ సిటీ ప్రాంతం కాబట్టి ఆఫీసులు వదిలే టైంకి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుంది. దానికి బ్రో ఫ్యాన్స్ హడావిడి తోడైతే రోడ్ల మీద రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది.
అందుకే ముందు జాగ్రత్త చర్యగా లేట్ గా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బండ్ల గణేష్, హరీష్ శంకర్ తదితరులు అతిథులుగా హాజరు కాబోతున్నారు. మైత్రి అధినేతలు, సూర్య మూవీస్ ఏఎం రత్నం, డివివి దానయ్య వచ్చే ఆవకాశాలున్నాయి. ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ అభిమానులు ఇప్పటికే తండోపతండాలుగా ఈవెంట్ దగ్గరకు చేరుకున్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని సేఫ్ సైడ్ కోసం త్వరగా వచ్చేశారు. అయితే వీళ్ళందరికీ ముందే సిద్ధపడకపోయినా సుదీర్ఘమైన వెయిటింగ్ తప్పదు.
యావరేజ్ గా తొమ్మిదికి మొదలుపెట్టినా అవసరం లేని తతంగాలతో సమయం వృథా చేయకుండా నేరుగా స్పీచులతోనే వేగంగా నడిపించేలా ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించొచ్చు. అయితే త్రివిక్రమ్, బండ్ల గణేష్ లాంటి వాళ్ళు మంచి గూస్ బంప్స్ ఇచ్చేలా మాట్లాడతారని ఎదురు చూస్తున్న వాళ్లకు మాత్రం నిరాశ తప్పకపోవచ్చు. వర్షం అడ్డంకి లేకపోయి ఉంటే అవన్నీ జరిగేవే. ఎంత ఫాస్ట్ గా చేసినా అర్ధరాత్రి అవుతుంది కాబట్టి యాంకర్లు, డాన్సర్ల విన్యాసాలు లేకుండా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ తరహాలో వేడుకని ముగించడం తప్ప వేరే ఆప్షన్ లేదు.
This post was last modified on July 25, 2023 5:07 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…