ఇటీవలే అమెజాన్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ పూర్తి చేసుకుని ఆరు నెలల బ్రేక్ తీసుకున్న సమంతా గతంలో నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్సులు వెనక్కు ఇచ్చి మరీ ప్రశాంతత కోసం టూర్ మొదలుపెట్టింది. ముందు వేలూరులోని స్వర్ణ దేవాలయంని సందర్శించింది. ఆ తర్వాత ఈషా యోగ సెంటర్ లో మెడిటేషన్ సెషన్ కు హాజరయ్యింది. అక్కడి నుంచి ఆదివారం బాలికి వెళ్ళిపోయి ఏరియల్ యోగాసనాలు, కఠినమైన డైట్ తో శారీకరంగా, మానసికంగా ధృడంగా మారే దిశగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటోంది. సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది.
ఇంకో ముప్పై అయిదు రోజుల్లో విజయ్ దేవరకొండ ఖుషి రిలీజ్ కానుంది. దాని ప్రమోషన్లకు హాజరు కావడం కోసం యాత్ర నుంచి బ్రేక్ తీసుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే టీమ్ తానున్న చోటికే వెళ్లి ఇంటర్వ్యూలు గట్రా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. గతంలోనూ యశోదకు ఇదే తరహాలో చేసినప్పుడు వర్కౌట్ అయ్యింది కనక ఈసారి కూడా అదే పద్దతి ఫాలో కావొచ్చు. సిటాడెల్ స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్ చేశాక దానికి సంబంధించిన పబ్లిసిటీలో భాగం కావాల్సి ఉంటుంది. దాని తాలూకు నిబంధన అగ్రిమెంట్ లోనే ఉంటుంది కాబట్టి సామ్ అప్పుడు బయటికి రావొచ్చు.
ఈ రెండు బాధ్యతలు తప్ప సమంతా మీద ఎలాంటి ఒత్తిడి లేదు. తాజాగా జుత్తుని కత్తించుకుని ఇచ్చిన స్టిల్స్ ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. ఎలాగూ షూటింగులు లేవు కాబట్టి హెయిర్ స్టైల్ తో ప్రత్యేకంగా పనేం లేదు. అందుకే పొట్టి శిరోజాలకు ఓటేసింది. ఆఫర్లకు లోటు లేకపోయినా హెల్త్ విషయంలో డాక్టర్ లు చేసిన సూచన మేరకు సామ్ ఇంత రెస్ట్ తీసుకోవాల్సిన పని పడింది. శాకుంతలం డిజాస్టర్ బాధ పెట్టినా ఖుషి ఆ లోటుని పూర్తిగా తీరుస్తుందన్న నమ్మకం తనలో ఉంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ సెప్టెంబర్ 1న థియేటర్లలో అడుగుపెట్టనుంది.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…