Movie News

రెండు ఫ్లాపులిచ్చినా ప్యాన్ ఇండియా సినిమా దక్కింది

ఒక్కోసారి కొందరు దర్శకులపై డిజాస్టర్ల ప్రభావం అంతగా పడదు. పై పెచ్చు అంతకన్నా మంచి ఆఫర్లతో లక్కీ ఛాన్స్ కొట్టేస్తారు. ఇంద్రగంటి మోహనకృష్ణను చూస్తే అదే అనిపిస్తుంది. ఈయన గత చిత్రం ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సూపర్ డూపర్ ఫ్లాప్. సుధీర్ బాబు బోలెడు నమ్మకం పెట్టుకుంటే నీరుగారిపోయింది. కృతి శెట్టి డ్యూయల్ రోల్ చేసినా లాభం లేకపోయింది. దీనికన్నా ముందు నానిని నెగటివ్ షేడ్స్ లో చూపించిన వి ఫలితం కూడా అంతే. డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కాబట్టి సేఫ్ అయ్యింది కానీ నేరుగా థియేటర్లకు వచ్చి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది.

అయినా సరే నిర్మాత దిల్ రాజుకు ఇంద్రగంటి మీద తగని గురి. అందుకే ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ జటాయువుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో దీని ప్రస్తావన తెచ్చారు కానీ హీరో తదితర వివరాలు చెప్పలేదు. విజయ్ దేవరకొండ దీని పట్ల సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ప్రస్తుతం రాజుగారి బ్యానర్ లోనే పరశురామ్ డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్(ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తున్న రౌడీ హీరోకు జటాయు కథ బాగా నచ్చిందట. బడ్జెట్ పరిమితులు లేకుండా నిర్మిస్తున్నారు కాబట్టి మంచి ఛాన్స్ అనుకుని ఓకే చెప్పినట్టు వినికిడి.

సో ఈ అవకాశాన్ని ఇంద్రగంటి ఎలా వాడుకుంటారో చూడాలి. ప్రస్తుతం స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శాకుంతలం విషయంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా మంచి గ్రాఫిక్స్ టీమ్ ని సెట్ చేసుకోమని దిల్ రాజు చెప్పారట. ప్రస్తుతం ఖుషి ప్రమోషన్లకు రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ సమాంతరంగా పరశురామ్, గౌతమ్ తిన్ననూరిలతో పని చేయనున్నాడు. జటాయుకి నిర్మాణానికి టైం పట్టేలా ఉంది కనక వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 

This post was last modified on July 25, 2023 1:42 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

3 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

5 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

6 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

6 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

7 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

7 hours ago