Movie News

‘బ్రో’కి సేమ్ మ్యాజిక్ జరుగుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మొదలైనపుడు.. మేకింగ్ దశలో ఉన్నపుడు పరిస్థితి ఎలా ఉన్నా సరే.. రిలీజ్ టైంకి మొత్తం కథ మారిపోతుంది. ఆటోమేటిగ్గా హైప్ వచ్చేస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రీమేక్ మూవీ చేశాడంటే.. అభిమానులు ముందు నిట్టూర్చడం.. మేకింగ్ దశలో కూడా లైట్ తీసుకోవడం మామూలే. కానీ రిలీజ్ దగ్గరపడేకొద్దీ హైప్ పెరుగుతూ వస్తుంది. విడుదల రోజు థియేటర్లలో సందడి మామూలుగా ఉండదు.

గోపాల గోపాల.. కాటమరాయుడు.. వకీల్ సాబ్.. భీమ్లా నాయక్.. ఈ సినిమాలన్నింటి విషయంలోనూ ఇలాగే జరిగింది. ముఖ్యంగా ‘కాటమరాయుడు’, ‘వకీల్ సాబ్’ సినిమాల విషయంలో అభిమానుల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలిసిందే. కానీ అవి కూడా మంచి హైప్ మధ్యే రిలీజయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు ‘బ్రో’ సినిమా విషయంలోనూ అభిమానుల్లో ముందు నుంచి అసంతృప్తే ఉంది. రీమేక్.. పైగా క్లాస్ టచ్ ఉన్న సినిమా కావడం.. ఇంకా రకరకాల కారణాల వల్ల ఈ సినిమాకు హైప్ లేదు.

రిలీజ్ దగ్గర పడుతున్నా సరే.. ‘బ్రో’కు అనుకున్నంత హైప్ లేనట్లే  కనిపిస్తోంది. పాటలు కూడా అభిమానుల్లో హుషారు తెప్పించలేకపోయాయి. ట్రైలర్ వరకు బాగానే అనిపించింది. యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని రోజుల ముందే మొదలు కాగా.. కొంచెం నెమ్మదిగానే సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. పవన్ సినిమాలకు ప్రతిసారీ జరిగే మ్యాజిక్ ఈసారి జరుగుతుందా లేదా అన్నది కొంచెం సందేహంగానే ఉంది.

దీనికి అన్ని నెగెటివ్స్ కనిపిస్తున్నాయి మరి. కానీ పవన్ క్రేజ్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. రీమేక్‌ల విషయంలో తమ అసహనాన్ని వెళ్లగక్కే అభిమానులే.. రిలీజ్ టైంకి సర్దుకుని థియేటర్లకు పరుగులు పెడతారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎగబడతారు. బుకింగ్స్ మొదలైతే టికెట్ ముక్క మిగలనివ్వరు. థియేటర్లు మొత్తం ఫ్యాన్స్‌తో నిండిపోతాయి. మరి ఈ నెల 28న ఏం జరుగుతుందో చూడాలి.

This post was last modified on October 8, 2023 4:34 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

5 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

6 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

8 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

8 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

9 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

9 hours ago