టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు మరోసారి మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు సినిమా గుంటూరు కారం నుంచి అతణ్ని తప్పించారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. గత నెలలో ఒకసారి ఇలాగే జరిగితే.. తమన్ ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాడు. చిత్ర బృందం కూడా అతణ్ని సినిమా నుంచి తప్పించినట్లేమీ ప్రకటించలేదు. రూమర్ల మీద మౌనం వహించింది.
గుంటూరు కారంలో తాను ఉన్నానని.. చక్కగా పాటలు చేసుకుంటున్నానని తమన్ క్లారిటీ ఇచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు తమన్పై వేటు ఖాయం అంటూ మరోసారి జోరుగా ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో మలయాళ సంగీత దర్శకుడు, ఖుషీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న హేషమ్ అబ్దుల్ను ఎంపిక చేశారని కూడా అంటున్నారు. ఐతే ఈ ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలోనే బ్రో ప్రమోషన్లలో భాగంగా తమన్ ఇచ్చిన ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో అతను గుంటూరు కారం గురించి ప్రస్తావన తెచ్చాడు. తాను ఈ సినిమాలో పక్కాగా ఉన్నానని కన్ఫమ్ చేశాడు. తాను ఈ సినిమాలో లేకపోతే చిత్ర బృందం ఆ విషయాన్ని ప్రకటించేది కదా అని అతను ప్రశ్నించాడు. రాసేవాళ్లు, ప్రచారం చేసేవాళ్లు ఏమైనా చేసుకోనీ.. తాను మాత్రం తన పని చేసుకుపోతున్నానని అతను స్పష్టం చేశాడు. గుంటూరు కారం పాటల పని జరుగుతున్నట్లు అతను క్లారిటీ ఇచ్చాడు. తాను పనితోనే అందరికీ సమాధానం చెబుతానని కూడా తమన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐతే ఈ ఇంటర్వ్యూ జరిగే సమయానికి తమన్కు కూడా క్లారిటీ ఉండకపోవచ్చని.. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అతడిపై వేటు పడి ఉండొచ్చేమో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
This post was last modified on July 25, 2023 1:05 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…