‘బ్రో’ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టి బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది టీం. ముందుగా హీరోయిన్స్ ఆ తర్వాత తేజ్. తమన్ మీడియా ముందుకొచ్చారు. ఇప్పుడు దర్శకుడి వంతు. సినిమా ఫస్ట్ కాపీ చెకింగ్ చేస్తున్న దర్శకుడు తాజాగా మీడియా ముందుకొచ్చి ‘బ్రో’ సినిమా విశేషాలు పంచుకున్నాడు. ముందుగా ఈ కథ త్రివిక్రమ్ గారికి చెప్తే , మీరే హీరోగా చేస్తారా ? అని అడిగారని ,కోవిడ్ టైమ్ లో తమిళ్ లో ఏ హీరో ముందుకు రాకపోతే తనే తప్పక చేశానని ఆయనకి కన్వే చేశానని అప్పుడు త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ తో చేస్తారా ? అనేసరికి తనకి నోటి నుండి మాట రాలేదని తెలిపాడు.
ఇక స్క్రిప్ట్ నరేషన్ అవ్వగానే షూటింగ్ ఎప్పటి నుండి అనుకుంటున్నారు ? అనే ప్రశ్న పవన్ నుండి వచ్చిందని, దానికి రేపటి నుండే అంటూ తను సమాధానం ఇచ్చే సరికి ఆయన షాక్ అయ్యాడని, నాకు రెండు మూడు రోజులు టైమ్ ఇవ్వమని పవన్ అడిగారని , అప్పటికే సెట్ , అన్నపూర్ణలో నాలుగు ఫ్లోర్స్ తో పక్కా ప్లానింగ్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసేశామని సముద్రఖని చెప్పుకున్నాడు.
ఈ సినిమా కోసం పవన్ కేవలం 21 రోజులు పని చేశారని , కొన్ని రోజులు మధ్యాహ్నమే ఆయనని ఘాట్ నుండి పంపించేసేవాడినని తెలిపాడు. 50 , 60 రోజుల్లో చేయాల్సిన వర్క్ ను తమ ప్లానింగ్ తో చాలా తక్కువ రోజులకే పూర్తి చేశామనన్నారు. అంతే కాదు పవన్ ఫస్ట్ టైమ్ లొకేషన్ లోనే నెక్స్ట్ సీన్ కోసం షర్ట్ మార్చేశారని , ఆయన కూడా ఎక్కడా టైమ్ వృధా కాకూడదని భావించి వర్క్ చేశారని చెప్పుకున్నారు సముద్రఖని. పవన్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి ఓ మంచి కథ చెప్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
This post was last modified on July 24, 2023 8:50 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…