సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు బాగా టెన్షన్లో ఉన్నారు. రాజమౌళి సినిమాతో మహేష్ గ్లోబల్ స్థాయికి వెళ్లబోయే ముందు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేస్తున్న ‘గుంటూరు కారం’ మూవీతో ఒక పెద్ద సక్సెస్ అందుకుంటాడని ఆశిస్తే.. ఆ సినిమాకు సంబంధించి ఎడతెగని నెగెటివ్ న్యూస్లు మీడియాలో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ‘గుంటూరు కారం’ పేరెత్తితేనే చిరాకు వచ్చేసే పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే ఈ సినిమా కథ మారింది. నటీనటులు, టెక్నీషియన్లు మారారు. తరచుగా సినిమా షూటింగ్కు బ్రేకులు పడుతున్నాయి. మరోవైపు రిలీజ్ డేటేమో దగ్గర పడిపోతోంది. ఇన్ని మార్పులు చేర్పులు, వివాదాల తర్వాత సినిమా అనుకున్నట్లుగా సంక్రాంతికి రిలీజవుతుందా లేదా అన్న డౌట్లు కలుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అసలీ సినిమా ముందుకు కదులుతుందా.. మధ్యలో ఆగిపోతుందా అనే సందేహాలు కూడా చాలామందిలో ఉన్నాయి.
ఐతే ఎన్ని వివాదాలున్నా.. ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా సినిమా అయితే ఆగే పరిస్థితి లేదన్నది చిత్ర వర్గాల సమాచారం. మహేష్ లాంటి పెద్ద స్టార్, త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ మధ్య ఓ పెద్ద నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న సినిమాను మధ్యలో ఆపేస్తే అది చాలా పెద్ద ఇష్యూగా మారుతుంది. అసలు ఈ సినిమా మీద ఇప్పటికే వంద కోట్ల దాకా ఖర్చు కూడా పెట్టేశారు. మహేష్తో సహా ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఇచ్చిన పారితోషకమే ఇందులో 60-70 శాతం దాకా ఉంది. ప్రొడక్షన్ మీద కూడా 30-40 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. సినిమా ఆరంభ దశలోనే బయ్యర్ల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నారు.
ఇంత జరిగాక సినిమాను ఆపేయడం అంటే అసాధ్యమనే చెప్పాలి. ఎన్ని సమస్యలున్నా పరిష్కరించుకుని సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సిందే. మహేష్ ఏడాది కిందట్నుంచి ఈ ప్రాజెక్టుకే అంకితమై ఉన్నాడు. ఇప్పుడు సినిమా ఆపడానికి అతను మాత్రం ఎలా అంగీకరిస్తాడు? సినిమా ఆపే ప్రసక్తే లేకపోగా.. ఎలాగైనా వచ్చే సంక్రాంతికే రిలీజ్ చేయాలని కూడా టీం భావిస్తోంది. మహేష్ వెకేషన్ నుంచి తిరిగొచ్చాక టీం అంతా ఒకసారి కూర్చుని ఇకపై ఏ సమస్యలూ రాకుండా ఒక మాట అనుకుని చిత్రీకరణను వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on July 24, 2023 4:04 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…