అసలు ఇంతకీ ఏ ముహూర్తంలో గుంటూరు కారంకి శ్రీకారం చుట్టారో ఓసారి చెక్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి మార్పుల ప్రహసనం అంతులేని కథగా సాగుతూనే ఉంది. తాజాగా కెమెరా మెన్ పీఎస్ వినోద్ తప్పుకుని ఆ స్థానంలో రవి కె చంద్రన్ వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. యూనిట్ అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ వార్త గుప్పుమని ఫిలిం నగర్ వర్గాల్లో తిరుగుతూనే ఉంది. వినోద్ గతంలో త్రివిక్రమ్ తో కలిసి అల వైకుంఠపురములోతో పాటు అరవింద సమేత వీర రాఘవకు పని చేశారు. వాటి క్వాలిటీ అవుట్ ఫుట్ లో ఆయన పాత్ర ఎంత వుందో ప్రత్యక్షంగా చూశాం.
మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళిపోయాడు. ఈసారి ట్రిప్ మూడు నాలుగు వారాలు జరిగేలా ఉంది. ఈలోగా ఇంకేమైనా రిపేర్లు , ఆర్టిస్టుల కాల్ షీట్లకు సంబంధించిన సమస్యలు ఉంటే త్రివిక్రమ్ సరిచేసుకోవాలి. జూలై ఎలాగూ అయిపోయింది కాబట్టి మిగిలింది ఇంకో అయిదు నెలలు మాత్రమే. ముందు ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి రిలీజ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని అభిమానులు కోరుకుంటున్నారు. రేస్ నుంచి ప్రభాస్ కల్కి తప్పుకోవడం దాదాపు ఖాయమవ్వడంతో పండగ సీజన్ ని మహేష్ అయితే బాగా వాడుకుంటాడని ఆశిస్తున్నారు.
ఫైనల్ గా ఏం జరుగుతుందో ఇప్పటికైతే చెప్పలేం కానీ ఈ పరిణామాలు బజ్ మీద ప్రభావం చూపించేలా ఉన్నాయి. మహేష్ ఫ్యాన్స్ క్రమంగా రాజమౌళి ప్రాజెక్టు మీద ఆసక్తి పెంచుకుంటున్నారు. త్రివిక్రమ్ ని తక్కువంచనా వేయడానికి లేకపోయినా ఇన్నేసి సార్లు షాకులు తగులుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి రెండో కథానాయిక. తమన్ సంగీతం సంగతి ఇంకా తేలనే లేదు. అసలు పాటల కంపోజింగ్ అయిపోయిందో లేదో ఆ వార్త కూడా బయటికి రానివ్వకుండా గుట్టు మైంటైన్ చేస్తున్నారు. రిలీజ్ దాకా ఈ ట్విస్టులు తప్పవేమో.
This post was last modified on July 22, 2023 6:52 pm
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…