అసలు ఇంతకీ ఏ ముహూర్తంలో గుంటూరు కారంకి శ్రీకారం చుట్టారో ఓసారి చెక్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి మార్పుల ప్రహసనం అంతులేని కథగా సాగుతూనే ఉంది. తాజాగా కెమెరా మెన్ పీఎస్ వినోద్ తప్పుకుని ఆ స్థానంలో రవి కె చంద్రన్ వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. యూనిట్ అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ వార్త గుప్పుమని ఫిలిం నగర్ వర్గాల్లో తిరుగుతూనే ఉంది. వినోద్ గతంలో త్రివిక్రమ్ తో కలిసి అల వైకుంఠపురములోతో పాటు అరవింద సమేత వీర రాఘవకు పని చేశారు. వాటి క్వాలిటీ అవుట్ ఫుట్ లో ఆయన పాత్ర ఎంత వుందో ప్రత్యక్షంగా చూశాం.
మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళిపోయాడు. ఈసారి ట్రిప్ మూడు నాలుగు వారాలు జరిగేలా ఉంది. ఈలోగా ఇంకేమైనా రిపేర్లు , ఆర్టిస్టుల కాల్ షీట్లకు సంబంధించిన సమస్యలు ఉంటే త్రివిక్రమ్ సరిచేసుకోవాలి. జూలై ఎలాగూ అయిపోయింది కాబట్టి మిగిలింది ఇంకో అయిదు నెలలు మాత్రమే. ముందు ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి రిలీజ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని అభిమానులు కోరుకుంటున్నారు. రేస్ నుంచి ప్రభాస్ కల్కి తప్పుకోవడం దాదాపు ఖాయమవ్వడంతో పండగ సీజన్ ని మహేష్ అయితే బాగా వాడుకుంటాడని ఆశిస్తున్నారు.
ఫైనల్ గా ఏం జరుగుతుందో ఇప్పటికైతే చెప్పలేం కానీ ఈ పరిణామాలు బజ్ మీద ప్రభావం చూపించేలా ఉన్నాయి. మహేష్ ఫ్యాన్స్ క్రమంగా రాజమౌళి ప్రాజెక్టు మీద ఆసక్తి పెంచుకుంటున్నారు. త్రివిక్రమ్ ని తక్కువంచనా వేయడానికి లేకపోయినా ఇన్నేసి సార్లు షాకులు తగులుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి రెండో కథానాయిక. తమన్ సంగీతం సంగతి ఇంకా తేలనే లేదు. అసలు పాటల కంపోజింగ్ అయిపోయిందో లేదో ఆ వార్త కూడా బయటికి రానివ్వకుండా గుట్టు మైంటైన్ చేస్తున్నారు. రిలీజ్ దాకా ఈ ట్విస్టులు తప్పవేమో.
This post was last modified on July 22, 2023 6:52 pm
నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…
ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…
అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితంపై స్పందించారు. ఇంకా ఫలితం…
ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటే తాడేపల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే.. ఇది 41 రోజుల…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…