అసలు ఇంతకీ ఏ ముహూర్తంలో గుంటూరు కారంకి శ్రీకారం చుట్టారో ఓసారి చెక్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి మార్పుల ప్రహసనం అంతులేని కథగా సాగుతూనే ఉంది. తాజాగా కెమెరా మెన్ పీఎస్ వినోద్ తప్పుకుని ఆ స్థానంలో రవి కె చంద్రన్ వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. యూనిట్ అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ వార్త గుప్పుమని ఫిలిం నగర్ వర్గాల్లో తిరుగుతూనే ఉంది. వినోద్ గతంలో త్రివిక్రమ్ తో కలిసి అల వైకుంఠపురములోతో పాటు అరవింద సమేత వీర రాఘవకు పని చేశారు. వాటి క్వాలిటీ అవుట్ ఫుట్ లో ఆయన పాత్ర ఎంత వుందో ప్రత్యక్షంగా చూశాం.
మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళిపోయాడు. ఈసారి ట్రిప్ మూడు నాలుగు వారాలు జరిగేలా ఉంది. ఈలోగా ఇంకేమైనా రిపేర్లు , ఆర్టిస్టుల కాల్ షీట్లకు సంబంధించిన సమస్యలు ఉంటే త్రివిక్రమ్ సరిచేసుకోవాలి. జూలై ఎలాగూ అయిపోయింది కాబట్టి మిగిలింది ఇంకో అయిదు నెలలు మాత్రమే. ముందు ఫిక్స్ చేసుకున్న సంక్రాంతి రిలీజ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని అభిమానులు కోరుకుంటున్నారు. రేస్ నుంచి ప్రభాస్ కల్కి తప్పుకోవడం దాదాపు ఖాయమవ్వడంతో పండగ సీజన్ ని మహేష్ అయితే బాగా వాడుకుంటాడని ఆశిస్తున్నారు.
ఫైనల్ గా ఏం జరుగుతుందో ఇప్పటికైతే చెప్పలేం కానీ ఈ పరిణామాలు బజ్ మీద ప్రభావం చూపించేలా ఉన్నాయి. మహేష్ ఫ్యాన్స్ క్రమంగా రాజమౌళి ప్రాజెక్టు మీద ఆసక్తి పెంచుకుంటున్నారు. త్రివిక్రమ్ ని తక్కువంచనా వేయడానికి లేకపోయినా ఇన్నేసి సార్లు షాకులు తగులుతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి రెండో కథానాయిక. తమన్ సంగీతం సంగతి ఇంకా తేలనే లేదు. అసలు పాటల కంపోజింగ్ అయిపోయిందో లేదో ఆ వార్త కూడా బయటికి రానివ్వకుండా గుట్టు మైంటైన్ చేస్తున్నారు. రిలీజ్ దాకా ఈ ట్విస్టులు తప్పవేమో.
This post was last modified on July 22, 2023 6:52 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…