బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. విడుదలైన ప్రతి చోటా ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు, రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం అది.
అంతేకాదు, రష్యా, జర్మనీ, పాకిస్తాన్, చైనా, జపాన్ వంటి పలు భాషల్లోకి ఈ చిత్రాన్ని అనువదించారు. ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమై ఆయా దేశాల్లో ప్రదర్శితమై అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన ఈ సినిమాకు అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి.
దర్శక ధీరుడు జక్కన్న మలిచిన ఈ సినీ శిల్పం తాజాగా మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రభాస్ ను పాన్ ఇండియా హీరోగా మార్చిన ఈ చిత్రాన్ని తాజాగా మంగోలియా భాషలోకి అనువదించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 16న మంగోలియాలోని ‘టీవీ-5’ చానెల్లో బాహుబలి చిత్రం ప్రదర్శించబోతున్నారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగోలియాలోని ఇండియన్ మంగోలియాలోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఇండియన్ ఫిలిం ఫెస్టివల్’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బాహుబలి చిత్రాన్ని అక్కడి చానెల్ ‘TV-5’ లో ఆగస్టు 16న ప్రదర్శిస్తున్నారు. మంగోలియా భాషలో బాహుబలిని స్థానికులు వీక్షించనున్నారు.
దీంతోపాటు, ఆగస్టు 15న కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషించిన బాలీవుడ్ హిట్ మూవీ ‘క్వీన్’ మంగోలియా భాషలో ప్రసారం చేయనున్నారు. ఆగస్టు 17న మరో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ నటించిన ‘నీర్జా’ బయోపిక్ మంగోలియా భాషలో ప్రదర్శించనున్నారు.
This post was last modified on August 15, 2020 3:49 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…