నిన్న భారీ అంచనాల మధ్య వచ్చిన ప్రాజెక్ట్ కెలో ప్రభాస్ ఫస్ట్ లుక్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ నుంచి అధిక శాతం మిశ్రమ స్పందన దక్కించుకుంది. వాటిలో నెగటివిటీనే ఎక్కువగా ఉంది. నిజానికి వైజయంతి మూవీస్ ఈ పోస్టర్ బయటికి రాగానే నేషన్ వైడ్ హాట్ టాపిక్ గా మారుతుందని అంచనా వేసింది. కానీ దానికి రివర్స్ లో ఫీడ్ బ్యాక్ రావడంతో అదే లుక్ కి కొన్ని మార్పులు చేసి ఇమేజ్ డిలీట్ చేసి కొత్తది పెట్టింది. అయినా పెద్దగా లాభం లేదు. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె అనే టైటిల్ తీసేయడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ లో చేసిన చిన్న చేంజెస్ గుర్తుపట్టేలా కూడా లేవు.
దీని సంగతి కాసేపు పక్కనపెడితే ఈ విషయంలో దర్శకుడు నాగ అశ్విన్ వైపే అందరి వేళ్ళు వెళ్తున్నాయి. మహానటి లాంటి ట్రాజెడీ బయోపిక్ ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించి బ్లాక్ బస్టర్ సాధించిన ఈ క్రియేటివ్ జీనియస్ ఒక సూపర్ హీరో మూవీని ఓ రేంజ్ లో డీల్ చేస్తాడని నమ్మకం పెట్టుకోవడం సహజం. అయితే కేవలం చలనం లేని ఒక్క పోస్టర్ తోనే అతని ప్రతిభను తక్కువ అంచనా వేయలేం కానీ డిజైన్ టైంలోనే కనీస జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. ప్యాన్ వరల్డ్ గా ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు ప్లానింగ్ అవసరం. ఇక్కడ కొంత నిర్లక్ష్యం కనిపించింది.
రేపు రాబోయే టీజర్ వీటికి సమాధానం చెప్పాల్సిందే. లేదంటే ప్రతికూలత ఇంకా పెరిగిపోతుంది. అసలే ప్రభాస్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ తో ఉన్నాడు. సలార్ మీద గ్యారెంటీ బ్లాక్ బస్టరనే టాక్ ఉంది కానీ అంతకు మించి ప్రాజెక్ట్ కె మీద ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. శాన్ డియెగో వేదిక పై ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకునేలతో పాటు అశ్విన్ తదితరులు టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు. ఇందులో కూడా మరీ ఓవర్ ఎగ్జైట్ మెంట్ గురి చేసే కంటెంట్ ఉండకపోవచ్చని, కేవలం ప్రభాస్ ని రివీల్ చేయడానికి పరిమితం చేశారని ఇన్ సైడ్ టాక్. ఇంకో కొన్ని గంటల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికేస్తుంది.
This post was last modified on July 20, 2023 8:22 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…