నిన్న భారీ అంచనాల మధ్య వచ్చిన ప్రాజెక్ట్ కెలో ప్రభాస్ ఫస్ట్ లుక్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ నుంచి అధిక శాతం మిశ్రమ స్పందన దక్కించుకుంది. వాటిలో నెగటివిటీనే ఎక్కువగా ఉంది. నిజానికి వైజయంతి మూవీస్ ఈ పోస్టర్ బయటికి రాగానే నేషన్ వైడ్ హాట్ టాపిక్ గా మారుతుందని అంచనా వేసింది. కానీ దానికి రివర్స్ లో ఫీడ్ బ్యాక్ రావడంతో అదే లుక్ కి కొన్ని మార్పులు చేసి ఇమేజ్ డిలీట్ చేసి కొత్తది పెట్టింది. అయినా పెద్దగా లాభం లేదు. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె అనే టైటిల్ తీసేయడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ లో చేసిన చిన్న చేంజెస్ గుర్తుపట్టేలా కూడా లేవు.
దీని సంగతి కాసేపు పక్కనపెడితే ఈ విషయంలో దర్శకుడు నాగ అశ్విన్ వైపే అందరి వేళ్ళు వెళ్తున్నాయి. మహానటి లాంటి ట్రాజెడీ బయోపిక్ ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించి బ్లాక్ బస్టర్ సాధించిన ఈ క్రియేటివ్ జీనియస్ ఒక సూపర్ హీరో మూవీని ఓ రేంజ్ లో డీల్ చేస్తాడని నమ్మకం పెట్టుకోవడం సహజం. అయితే కేవలం చలనం లేని ఒక్క పోస్టర్ తోనే అతని ప్రతిభను తక్కువ అంచనా వేయలేం కానీ డిజైన్ టైంలోనే కనీస జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. ప్యాన్ వరల్డ్ గా ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు ప్లానింగ్ అవసరం. ఇక్కడ కొంత నిర్లక్ష్యం కనిపించింది.
రేపు రాబోయే టీజర్ వీటికి సమాధానం చెప్పాల్సిందే. లేదంటే ప్రతికూలత ఇంకా పెరిగిపోతుంది. అసలే ప్రభాస్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ తో ఉన్నాడు. సలార్ మీద గ్యారెంటీ బ్లాక్ బస్టరనే టాక్ ఉంది కానీ అంతకు మించి ప్రాజెక్ట్ కె మీద ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. శాన్ డియెగో వేదిక పై ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకునేలతో పాటు అశ్విన్ తదితరులు టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు. ఇందులో కూడా మరీ ఓవర్ ఎగ్జైట్ మెంట్ గురి చేసే కంటెంట్ ఉండకపోవచ్చని, కేవలం ప్రభాస్ ని రివీల్ చేయడానికి పరిమితం చేశారని ఇన్ సైడ్ టాక్. ఇంకో కొన్ని గంటల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికేస్తుంది.
This post was last modified on July 20, 2023 8:22 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…