టాలీవుడ్లో చాలా ఏళ్లుగా చర్చల్లో ఉన్న మెగా ప్రాజెక్ట్ హిరణ్య కశ్యప మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికాలో కామిక్ కాన్ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా రానా దగ్గుబాటి ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. అంతే కాక ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టు అందిస్తున్న విషయం కూడా వెల్లడించాడు. దీంతో అందరి చూపూ గుణశేఖర్ వైపు మళ్లింది. ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాను ముందు అనౌన్స్ చేసింది గుణశేఖర్.
‘రుద్రమదేవి’ తర్వాత ఆయన చేయాలనుకున్న ప్రాజెక్టు కూడా ఇదే. ఆ సినిమాలో ముఖ్య పాత్ర చేసిన రానా దగ్గుబాటినే లీడ్ రోల్లోకి తీసుకోవాలనుకున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్లో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చింది. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా గుణశేఖర్ ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు. వేరే దర్శకుడితో సినిమా చేయనున్నట్లు గత ఏడాది ఆఖర్లో నిర్మాత సురేష్ బాబు ప్రకటించారు.
కట్ చేస్తే ఇప్పుడు రానా ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేయగానే.. గుణశేఖర్ వేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. దేవుడి మీద సినిమాలు తీయడం ఓకే కానీ.. మనం అనైతికంగా ఏదైనా చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడని మరిచిపోవద్దు అంటూ గుణశేఖర్ ఒక నర్మగర్భమైన ట్వీట్ వేశారు. తనను పక్కన పెట్టి ‘హిరణ్యకశ్యప’ను చేయబోతుండటం మీదే ఈ ట్వీట్ అని అందరూ భావిస్తున్నారు. కాగా గతంలో ఒక ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘హిరణ్య కశ్యప’కు శ్రీకారం చుట్టిందే తను అనే విషయం చెబుతూ.. దాని కోంస తానెంత కష్టపడింది కూడా వివరించారు.
త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టులోకి రావడం గురించి మాట్లాడుతూ.. తాను నిజానికి సాయిమాధవ్ బుర్రాను డైలాగ్ రైటర్గా తీసుకున్నానని.. కానీ త్రివిక్రమ్ తనకు తానుగా ఈ చిత్రానికి మాటలు రాస్తానని ముందుకు వచ్చాడని.. ఐతే బ్రహ్మాండం కదా అనుకున్నానని.. కానీ తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని గుణ అన్నారు. ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే.. త్రివిక్రమ్ మాటల రచయితగా ఈ ప్రాజెక్టులోకి ప్రవేశించి.. మొత్తం స్క్రిప్టు మీద కంట్రోల్ తెచ్చుకున్నారని.. ఈ క్రమంలోనే వెర్షన్ మారిపోయి గుణశేఖర్ ప్రాజెక్టు నుంచే తప్పుకున్నాడని అర్థమవుతోంది. చూస్తుంటే త్రివిక్రమ్ ఏకై వచ్చి మేకైపోయినట్లుగా అనిపిస్తోంది.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…